News February 12, 2026

సంక్షోభంలో సింగరేణి.. కొత్త CMD గట్టెక్కించేనా?

image

సింగరేణి నూతన సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా నైనీ బొగ్గు బ్లాకుల టెండర్లు, నిధుల మళ్లింపు ఆరోపణలతో రేగిన రాజకీయ దుమారం, కేంద్ర విచారణల నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి సమర్థుడైన అధికారికి పగ్గాలు అప్పగించేలా భారీ కసరత్తు చేశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడంలో కొత్త బాస్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కార్మికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Similar News

News March 13, 2026

పచ్చి ఆకు ఎరువుతో కలిగే ప్రయోజనాలు

image

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.

News March 13, 2026

KMM: ఉన్నోళ్లకే పట్టాలు.. లేనోళ్లకు కన్నీళ్లు..!

image

వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలనే CM ఆశయాన్ని అధికారుల నిర్లక్ష్య వైఖరి నీరుగార్చుతోంది. లబ్ధిదారుల ఎంపికలో వెలుగులోకి వచ్చిన అనర్హుల వివరాలు జిల్లా మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇప్పటికే ఇల్లు, ఆస్తులు ఉన్నవారు, ఆభరణాలు ధరించినవారు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఖరీదైన కార్లలో వచ్చారట. ఈ విషయం నిఘావర్గాల విచారణలో వెల్లడికావడం నిరుపేద కుటుంబాల్లో ఆగ్రహం తెప్పిస్తోంది.

News March 13, 2026

HYD: శ్రీలంక టూర్‌కి కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టుకు అనుమతి

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టుకు శ్రీలంక పర్యటనకు అనుమతి లభించింది. తెలంగాణ జిల్లాల నుంచి ఎంపికైన యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం కల్పించడానికి ఈ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. టీమ్‌తె కోచ్ GS రాజు, మేనేజర్ వెంకటేశ్వరరావు, అబ్జర్వర్ శ్రీనివాస్ ఉంటారు. గ్రాస్‌రూట్ స్థాయిలో క్రికెట్ అభివృద్ధి చెందేలా చేయడం లక్ష్యం అంటున్నారు.