News February 12, 2025

సంగమేశ్వరం.. ఇక్కడ అన్నీ ప్రత్యేకతలే!

image

ఆలయాల్లో ఎక్కడైనా ఏడాది పొడవునా దర్శనం ఉంటుంది. కానీ సంగమేశ్వరంలో గుడి ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తుంది. ప్రపంచంలోనే ఏడు నదులు ఒకేచోట కలిసే ప్రదేశం సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే పుణ్య ప్రదేశం ఇదే. వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేప శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు.

Similar News

News December 7, 2025

NRPT: రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో జిల్లాకు మూడో స్థానం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ -14 బాలుర క్రికెట్ పోటీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బాలుర క్రికెట్ జట్టు మూడో బహుమతి సాధించింది. ఈ సందర్భంగా క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందించారు. రాబోయే రోజుల్లో ఆటలో చక్కటి ప్రతిభ చూపి మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్‌ను అభినందించారు.

News December 7, 2025

పవన్‌కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉడుపి(KN)లోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదును ప్రదానం చేశారు. ‘బృహత్ గీతోత్సవ’లో పవన్ మాట్లాడుతూ భగవద్గీత ఓ సారి చదివి ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, సమస్యలకు పరిష్కారంగా మనల్ని నడిపించే జ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు.

News December 7, 2025

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి: ASF కలెక్టర్

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన తొలి విడత సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ASF కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆదివారం ASF కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి తొలి విడత పోలింగ్ నిర్వహించే 5 మండలాల అధికారులు,మండల పంచాయతీ అధికారులు, జోనల్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు.