News February 12, 2025

సంగమేశ్వరం.. ఇక్కడ అన్నీ ప్రత్యేకతలే!

image

ఆలయాల్లో ఎక్కడైనా ఏడాది పొడవునా దర్శనం ఉంటుంది. కానీ సంగమేశ్వరంలో గుడి ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తుంది. ప్రపంచంలోనే ఏడు నదులు ఒకేచోట కలిసే ప్రదేశం సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే పుణ్య ప్రదేశం ఇదే. వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేప శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు.

Similar News

News December 11, 2025

కర్నూలు: ‘ఈనెల 21న జరిగే పల్స్ పోలియోను విజయవంతం చేయండి’

image

డిసెంబర్ 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు 3,52,164 మంది పిల్లలకు వందశాతం టీకా వేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన మెడికల్ ఆఫీసర్ల సెన్సిటైజేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పీహెచ్సీలు, యుపిహెచ్సీలలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. బయటికి మందులు పంపకూడదు, డెలివరీ తర్వాత డబ్బులు వసూలు చేయకూడదు అని స్పష్టం చేశారు.

News December 11, 2025

కర్నూలు కలెక్టర్‌కు 9వ ర్యాంకు.. మంత్రి టీజీ భరత్‌ ర్యాంక్ ఇదే..!

image

కర్నూలు కలెక్టర్‌ డాక్టర్ ఏ.సిరికి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 9వ ర్యాంక్ ఇచ్చారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక మొత్తం 1,023 ఫైల్స్ స్వీకరించారు. వాటిలో 714 ఫైల్స్ క్లియర్ చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్ 17వ స్థానంలో నిలిచారు. 548 ఫైళ్లను పరిష్కరించారు.

News December 10, 2025

100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

image

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.