News February 26, 2025

సంగారెడ్డి:ఈనెల 28 నుంచి నూతన ఉపాధ్యాయులకు శిక్షణ

image

సంగారెడ్డి జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా నూతనంగా విధులలో చేరిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఈనెల 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు విద్యాబోధన అంశాలపైన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్, బీసీ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

విజయవాడలో బాలుడిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

image

విజయవాడ వన్ టౌన్ పరిధి వాగు సెంటర్ వద్ద బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాలుడు రాచకొండ రుషి (9) ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. అతణ్ని GGHకి తరలించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఫేస్‌కి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యాలని సూచించారు. నగరంలో రోజు రోజుకి కుక్క కాట్లు అధికమవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News February 24, 2026

ఉగాదిలోపు ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కావాలి: కలెక్టర్

image

జిల్లాలో స్లాబ్ దశలో ఉన్న 2,700 ఇందిరమ్మ ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్‌తో కలిసి ఆయన పనులను సమీక్షించారు. గృహ ప్రవేశాలకు సిద్ధం చేయడంతో పాటు డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులకు స్పష్టం చేశారు.

News February 24, 2026

వరంగల్ సూపర్ స్పెషాలిటీపై హరీశ్‌రావుకు మంత్రి దామోదర్ కౌంటర్

image

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. బీఆర్‌ఎస్ హయాంలో పనులు 50% కూడా పూర్తికాలేదని, అశాస్త్రీయంగా వ్యయం పెంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ. 300 కోట్లు ఆదా చేసి పనులు వేగవంతం చేసిందన్నారు. 35 విభాగాలతో, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కేన్సర్ చికిత్స సహా ఆధునిక సేవలతో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.