News February 26, 2025

సంగారెడ్డి:ఈనెల 28 నుంచి నూతన ఉపాధ్యాయులకు శిక్షణ

image

సంగారెడ్డి జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా నూతనంగా విధులలో చేరిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఈనెల 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు విద్యాబోధన అంశాలపైన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్, బీసీ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన, కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలను అధికారులు తెలిపారు. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. డోంగ్లిలో 12.5 C, నస్రుల్లాబాద్ 12.6, మద్నూర్, జుక్కల్‌లలో 12.7, బీర్కూరులో 12.8, మాచారెడ్డి, బిబిపేట్ 12.9, గాంధారి 13.1, పాల్వంచ 13.2, బిచ్కుంద, పెద్ద కొడపగల్ 13.5 తదితర మండలాలు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 3, 2025

సీఎం పర్యటన.. జిల్లా వాసుల ఎదురుచూపులు

image

ఇవాళ హుస్నాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:00 గంటలకు హుస్నాబాద్ సభకు చేరుకోనున్నట్లు మంత్రి పొన్నం క్యాంపు కార్యాలయం తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు. ఇప్పటికే సభ ప్రాంగణం మొత్తం సర్వం సిద్ధమైంది. CM పర్యట నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News December 3, 2025

APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

image

APPSC ఈ క్యాలెండర్ ఇయర్‌లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <>ప్రకటించింది<<>>. రాతపరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష జనవరి 27, 31, ఫిబ్రవరి 9, 11, 12 తేదీల్లో, సంబంధిత సబ్జెక్టు పేపర్ల పరీక్షలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించనున్నారు. విశాఖ, తూ.గో., NTR, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్షలు జరగనున్నాయి.