News March 12, 2025
సంగారెడ్డిలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో ఈనెల ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు ఈనెల 22వ తేదీ వరకు జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ సంగారెడ్డిలోని మహిళా డిగ్రీ కళాశాలను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
Similar News
News November 18, 2025
త్వరలో అన్ని ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ECG మెషీన్లు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ఈసీజీ మెషీన్ వంటి ముఖ్యమైన వైద్య పరికరాలను అందజేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.కోటిన్నర విలువ చేసే వైద్య పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కేంద్రం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఉందన్నారు.
News November 18, 2025
త్వరలో అన్ని ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ECG మెషీన్లు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ఈసీజీ మెషీన్ వంటి ముఖ్యమైన వైద్య పరికరాలను అందజేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.కోటిన్నర విలువ చేసే వైద్య పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కేంద్రం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఉందన్నారు.
News November 18, 2025
ప్రకాశం: అన్నదాత సుఖీభవ నగదు జమ.. ఎంతమంది అర్హులంటే?

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 268165 మంది రైతులకు రూ.134 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జమవుతుందని, అలాగే 21వ విడత పిఎం కిసాన్ పథకం నగదు రూ.231000 మంది రైతులకు రూ. 46.28 కోట్లు నగదు జమ కానుందన్నారు.


