News February 17, 2025
సంగారెడ్డిలో మహిళపై అత్యాచారం.. నిందితుడు తమిళనాడు వాసి !

సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో గిరిజన మహిళపై శనివారం రాత్రి అత్యాచారం జరిగింది. అల్లాదుర్గం మండలానికి చెందిన గిరిజన దంపతులు అనంతపురం జిల్లా నేరేడుగొండలోని సేవాలాల్ దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. ఫసల్వాది సమీపంలోకి రాగానే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న భర్తపై దాడి చేశారు. దీనిపై సంగారెడ్డి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News March 11, 2026
ఆపరేషన్ హార్ముజ్.. రంగంలోకి ఇండియన్ నేవీ?

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలను సేఫ్గా తీసుకురావడానికి నేవీని పంపాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తమ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ జలసంధిని దాటలేక ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్లో 1,100 మందికిపైగా సెయిలర్స్ ఉన్న 38 భారతీయ వాణిజ్య నౌకలు చిక్కుకున్నాయి.
News March 11, 2026
BREAKING.. జగదాంబ జంక్షన్లో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం

నగరంలోని జగదాంబ జంక్షన్ మెడికల్ షాపు సమీపంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను సిటీ టాస్క్ ఫోర్స్, ఎంఆర్ పేట పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.36 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 10 మంది ఈస్ట్, వెస్ట్, విశాఖ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామని సీఐ దివాకర్ తెలిపారు.
News March 11, 2026
ఖమ్మం: ఉద్యోగం రాలేదని సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

ఉద్యోగం దొరకలేదన్న మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన మసనం సుష్మ(27) HYD కేపీహెచ్బీ కాలనీలో నివసిస్తూ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసేది. మూడేళ్ల క్రితం విప్రోలో ఉద్యోగం కోల్పోయిన ఆమె, అప్పటి నుంచి కొత్త కొలువు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తీవ్ర డిప్రెషన్కు లోనై ఫ్యాన్కు ఉరివేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


