News February 18, 2025
సంగారెడ్డిలో యువకుడి మర్డర్.. UPDATE

సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు <<15474129>>దారుణ <<>>హత్యకు గురైన విషయం తెలిసిందే. తన కూతురితో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో నిజాంపేట మండలం రాంచందర్ తండాకు చెందిన లారీ డ్రైవర్ దశరథ్(26)ను ఈనెల 12న అమ్మాయి తండ్రి గోపాల్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోపాల్, ఆయన భార్య విజ్జీబాయి, మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించగా నిన్న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Similar News
News December 5, 2025
నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులతో పోలిస్తే.. చలి తీవ్రత కాస్త తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగాయి. నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 18.4, రాజాపూర్ 18.7, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ మండలం దోనూరు 18.9, మహమ్మదాబాద్, హన్వాడ 19.5, జడ్చర్ల 20.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News December 5, 2025
నిర్మల్: రోడ్ల గుంతల కోసం క్యూఆర్ కోడ్.. కలెక్టర్ ప్రత్యేక డ్రైవ్

నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల మరమ్మతు కోసం కలెక్టర్ అభిలాష అభినవ్ క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న గుంతల ఫోటోలను పూర్తి వివరాలతో సహా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులకు పంపవచ్చు. సమాచారం ఆధారంగా గుంతలను తక్షణమే పూడ్చేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గుంతలు లేని రోడ్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
News December 5, 2025
వనపర్తి: 451 మంది వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు..!

జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీల్లోని 806 వార్డులకు గురువారం మొత్తం 451 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావి – 70 నామినేషన్లు.
✓ పానగల్ – 123 నామినేషన్లు.
✓ పెబ్బేరు – 117 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్ – 70 నామినేషన్లు.
✓ వీపనగండ్ల – 71 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు మొత్తం వార్డు సభ్యుల నామినేషన్లు 490కి చేరింది.


