News February 18, 2025
సంగారెడ్డిలో యువకుడి మర్డర్.. UPDATE

సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు <<15474129>>దారుణ <<>>హత్యకు గురైన విషయం తెలిసిందే. తన కూతురితో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో నిజాంపేట మండలం రాంచందర్ తండాకు చెందిన లారీ డ్రైవర్ దశరథ్(26)ను ఈనెల 12న అమ్మాయి తండ్రి గోపాల్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోపాల్, ఆయన భార్య విజ్జీబాయి, మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించగా నిన్న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Similar News
News March 28, 2025
PDPL: SFI పెద్దపల్లి నూతన జిల్లా కమిటీ ఎన్నిక

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా జిల్లాల ప్రశాంత్, ఎంపికయ్యారు, జిల్లా ఉపాధ్యక్షులు, బందెల రాజ్ కుమార్ సహాయ కార్యదర్శులు, మామిడిపెల్లి అరవింద్, కమిటీ సభ్యులుగా ఆదిత్య, రాజు, మణిరత్నం, అభిరామ్, శివలను ఎన్నుకున్నారు.
News March 28, 2025
డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై శుభవార్త

TG: గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. ఇంటి స్థలం లేని అర్హులకు వాటిని కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తిచేసుకునేలా ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో బేస్మెంట్ పూర్తిచేసిన వారికి తొలి విడత రూ.లక్ష చెల్లించాలని సూచించారు.
News March 28, 2025
సేవింగ్స్ స్కీమ్స్.. వడ్డీ రేట్లు యథాతథం

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్పై వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా కొనసాగించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ప్రస్తుత వడ్డీ రేట్లే ఉంటాయని తెలిపింది. సుకన్య సమృద్ధి యోజనకు 8.2%, మూడేళ్ల వ్యవధి డిపాజిట్లకు, PPFకు 7.1% ఉంటుంది. 115 నెలల కిసాన్ వికాస్ పత్రకు 7.5%, NCSకు 7.7%, నెలవారీ ఆదాయ పథకంపై 7.4% వడ్డీ ఉంటుంది. 2023-24 చివరి త్రైమాసికం నుంచి ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.