News April 2, 2025
సంగారెడ్డిలో 79,987.81 క్వింటాళ్ల సన్న బియ్యం సరఫరా: కలెక్టర్

సంగారాడ్డి జిల్లాలోని 846 రేషన్ దుకాణాల ద్వారా 79,987.81 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 3,78,728 రేషన్ కార్డులు ఉన్నట్లు చెప్పారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News November 23, 2025
బాపట్ల: ‘ఈ నంబర్తో స్లాట్ బుకింగ్’

ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేశామని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట శనివారం తెలిపారు. ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులు నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆర్ఎస్కెలలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ముందుగా టోకెన్ ఇస్తారని, ఎప్పుడు రావాలో తేదీ నిర్ణయించి, సమయం వారి ఫోన్కు సమాచారం వెళ్తుందన్నారు. 73373 59375 వాట్సాప్ నంబర్కు హాయ్ అని పంపితే మీకు స్లాట్ బుక్ చేస్తారన్నారు
News November 23, 2025
అక్రమ లేవుట్లు, భవనాల క్రమబద్దీకరణకు గడువు పెంపు

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమలేవుట్లు, భవనాల క్రమబద్దీకరణకు NMC అధికారులు మరోసారి అవకాశం కల్పించారు. BPS పథకంలో భాగంగా 1985 నుంచి 2025 ఆగస్టు వరకు అనధికారికంగా, అనుమతికి మించి నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించేందుకు వచ్చే ఏడాది మార్చి 11వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1113, 7981651881 నంబర్లను సంప్రదించాలని కమిషనర్ నందన్ కోరారు.
News November 23, 2025
భీమడోలు: పంట కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

భీమడోలు మండలం కురెళ్లగూడెంలోని వైర్ పంట కాల్వలో గుర్తు తెలియని మృతదేహాన్ని భీమడోలు పోలీసులు శనివారం గుర్తించారు. కొల్లేరు పొలాల్లోకి వెళ్లే వైర్ కాల్వలో సుమారు 35- 45 సం.లు వ్యక్తి మృతదేహం దుర్వాసన రావడంతో గుర్తించామని SI మదీనా బాషా తెలిపారు. మృతుడు గుండుతో చేతికి కాశీ తాడు కలిగి ఉన్నాడన్నారు. తాడేపల్లిగూడెం వైపు నుంచి కొట్టుకు వచ్చి ఉండొచ్చని స్థానిక VRO ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేశారు.


