News April 2, 2025

సంగారెడ్డి: ‘అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించాలి’

image

బడిబాట కార్యక్రమం మాదిరిగా అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత చంద్రన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతినెల 20న అంగన్వాడి కేంద్రాలను తనిఖీలు చేయాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, కలెక్టర్ చంద్రశేఖర్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి లలితకుమారి పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

BREAKING: భారత్ భారీ స్కోర్

image

U-19 ఆసియా కప్‌లో భాగంగా మలేషియాతో జరిగిన వన్డేలో భారత ప్లేయర్లు అదరగొట్టారు. 50 ఓవర్లలో 408/7 స్కోర్ చేశారు. అభిజ్ఞాన్ 125 బంతుల్లో అజేయంగా 209 రన్స్ చేశారు. ఇందులో 17 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. వేదాంత్ త్రివేది 90, వైభవ్ 50, ఆయుశ్ మాత్రే 14, చౌహాన్ 14 రన్స్ చేశారు. కాగా ఈ టోర్నీలో భారత్ యూఏఈ, పాక్‌పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది.

News December 16, 2025

BREAKING: భారత ప్లేయర్ విధ్వంసం.. డబుల్ సెంచరీ

image

U-19 ఆసియా కప్‌లో భాగంగా మలేషియాతో మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిజ్ఞాన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ చేశారు. ఇందులో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 48వ ఓవర్‌లో అభిజ్ఞాన్, చౌహాన్ 29 పరుగులు బాదారు. వరుసగా 4, వైడ్, 6, 6, 6, వైడ్, 1, 4 రన్స్ వచ్చాయి.

News December 16, 2025

జోజినగర్ స్థలం కబ్జాలో టీడీపీ నేతల పాత్ర: వైఎస్ జగన్

image

విజయవాడ భవానిపురంలోని జోజినగర్ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూ.150 కోట్ల విలువైన స్థలాన్ని టీడీపీ నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 2016లో రమా సొసైటీ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, 25 ఏళ్లుగా నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం దారుణమని జగన్ అన్నారు.