News March 30, 2025

సంగారెడ్డి: అంబులెన్స్, ట్రాక్టర్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

image

వికారాబాద్ నుంచి సంగారెడ్డికి వస్తున్న అంబులెన్స్ SRD జిల్లా కొండాపూర్(M) మల్కాపూర్ శివారులో ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. వివరాలు.. VKB జిల్లా కోట్‌పల్లి(M) నాగ్సాన్ పల్లి వాసి మల్లమ్మకు మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలిస్తున్నారు. మల్కాపూర్ సమీపంలో ట్రాక్టర్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో అంబులెన్స్ ఢీకొంది. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News January 8, 2026

SV ఆర్ట్స్ కళాశాలకు ఇన్నోవేషన్ సెంటర్

image

తిరుపతిలోని TTD ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ఇన్నోవేషన్ సెంటర్‌ను కేంద్ర మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఈ సెంటర్ దోహదపడుతుంది. విద్యార్థుల ఆలోచనకు జీవం పోసి నూతన ఆవిష్కరణలను వెలికితీయవచ్చు. దీనిపై కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.

News January 8, 2026

ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్

image

TG: ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి అర్హుడైన పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు.

News January 8, 2026

నేడు ఈ వస్తువులు దానం చేస్తే అదృష్టం

image

విష్ణువుకు ఇష్టమైన గురువారం నాడు పసుపు రంగు వస్తువులు దానమిస్తే జాతకంలో బృహస్పతి దోషాలు తొలగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం. పేదలకు పసుపు వస్త్రాలు, పప్పు ధాన్యాలు, అరటిపండ్లు, పసుపు మిఠాయిలను దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల వృత్తిలో పురోగతి లభించడమే కాకుండా, ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. స్తోమతను బట్టి చేసే దానం, విష్ణుమూర్తి కృపతో శుభాలను చేకూరుస్తుంది.