News March 18, 2025
సంగారెడ్డి: అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

నారాయణఖేడ్ నియోజకవర్గ భీమ్రాలో అదనపు కట్నం వేధింపులకు వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాగన్ పల్లికి చెందిన 22 ఏళ్ల పోగుల మహేశ్వరికి రెండేళ్ల క్రితం భీమ్రాకి చెందిన బొండ్ల పండరిరెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంగా ఇరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతున్నాయి. భర్త పండరి రెడ్డితో పాటు బంధువులు వేధించారు. సోమవారం ఉదయం మహేశ్వరి ఉరి వేసుకుని మరణించింది.
Similar News
News December 21, 2025
రేపు వరదలు, ప్రమాదాలపై మాక్ డ్రిల్

వరదలు, పరిశ్రమల ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు సోమవారం ఖమ్మం నయాబజార్లోని ZPSS, జనరల్ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మాక్ డ్రిల్ జరగనున్నందున ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇందులో 50 మంది చొప్పున ఆపద మిత్ర వలంటీర్లు, 20 మంది NCC కేడెట్లు పాల్గొంటారని తెలిపారు.
News December 21, 2025
రామలక్ష్మణపల్లిలో 7.9°C ఉష్ణోగ్రత

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. రామలక్ష్మణపల్లి 7.9°C, గాంధారి 8.2, మేనూర్ 8.4, జుక్కల్ 8.8, డోంగ్లి 8.9, నాగిరెడ్డిపేట 9, పెద్ద కొడప్గల్ 9.2, లచ్చపేట, సర్వాపూర్, దోమకొండ 9.3, బిచ్కుంద, నస్రుల్లాబాద్ 9.5, ఎల్పుగొండ 9.6, బొమ్మన్ దేవిపల్లి 9.7, మాచాపూర్ 9.8, పుల్కల్ 9.9, బీర్కూర్ 10°Cల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 21, 2025
BR అంబేడ్కర్ వర్సిటీలో 71 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఢిల్లీలోని డాక్టర్ <


