News March 18, 2025
సంగారెడ్డి: అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

నారాయణఖేడ్ నియోజకవర్గ భీమ్రాలో అదనపు కట్నం వేధింపులకు వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాగన్ పల్లికి చెందిన 22 ఏళ్ల పోగుల మహేశ్వరికి రెండేళ్ల క్రితం భీమ్రాకి చెందిన బొండ్ల పండరిరెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంగా ఇరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతున్నాయి. భర్త పండరి రెడ్డితో పాటు బంధువులు వేధించారు. సోమవారం ఉదయం మహేశ్వరి ఉరి వేసుకుని మరణించింది.
Similar News
News December 4, 2025
Party Time: గ్రామాల్లో జోరుగా దావతులు

పంచాయతీ ఎన్నికల పుణ్యమాని గ్రామాల్లో దావతులు జోరందుకున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో సాయంత్రం కాగానే పెద్ద ఎత్తున పార్టీలు చేసుకుంటున్నారు. ఇందుకోసం పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను గ్రూపుల వారీగా విభజించి మద్యం, స్టఫ్ సమకూరుస్తున్నారు. ప్రతిరోజు కొన్ని గ్రూపులకు దావత్ ఏర్పాటు చేయాల్సి రావడంతో అభ్యర్థుల చేతి చమురు భారీగానే వదులుతోంది.
News December 4, 2025
విశాఖ: క్రికెటర్ కరుణ కుమారికి ఘన సత్కారం

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్కు అనుగుణంగా కరుణకుమారికి ప్రత్యేకంగా రెండు క్రికెట్ కిట్లకు రూ.50వేలు ఇవ్వడం జరిగిందన్నారు. భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపిన ఆమెకు ప్రోత్సాహకంగా కలెక్టర్ రూ.లక్ష చెక్ అందజేశారు
News December 4, 2025
కామారెడ్డి: డీజీపీకి పూల మొక్కను అందజేసిన కలెక్టర్

డీజీపీ శివధర్ రెడ్డిని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డిలో మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.


