News April 16, 2025
సంగారెడ్డి: అర్హులందరకీ ఇందిరమ్మ ఇల్లు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పారు. కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 17 నుంచి లబ్ధిదారుల జాబితాను అందిస్తామని చెప్పారు. అర్హుల జాబితాలు మే 2వ తేదీలోగా డిస్ ప్లే చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
WGL: గుర్తుల పంచాయితీ!

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.
News December 1, 2025
బాపట్ల: వీడియోలు చూపించి అత్యాచారంపై కేసు నమోదు

చీరాలకు చెందిన ఓ మహిళ తనను బెదిరించి అత్యాచారం చేశారని బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టౌన్ పోలీసులు న్యాయవాది తులసీరావు, టీడీపీ మహిళా కార్యకర్త రజని సహా 8 మందిపై కేసు నమోదు చేశారు. వీడియోలు చూపించి బెదిరించి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు టౌన్ సీఐ రాంబాబు తెలిపారు.
News December 1, 2025
ఉమ్మడి నల్గొండలో పార్టీ బలోపేతంపై BJP ఫోకస్..!

తెలంగాణలో బీజేపీ బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు జిల్లాల ఇన్ఛార్జ్లను కొత్తగా నియమించారు. జిల్లాల వారీగా నాయకత్వ మార్పులు చేసి, గ్రౌండ్లో కార్యకర్తలతో అనుసంధానం, పంచాయతీ ఎన్నికల వేళ దూకుడు పెంచాలని పార్టీ భావిస్తోంది. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా ఉదయ్ను నియమించగా, సూర్యాపేటకు టీ.రమేశ్, యాదాద్రి భువనగిరికి శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించారు.


