News February 27, 2025

సంగారెడ్డి: ఆలయం సమీపంలో మహిళ మృతదేహం

image

మహాశివరాత్రి వేళ సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. సదాశివపేటలోని శంభు లింగేశ్వర ఆలయం వెనుక మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో పరిశీలిస్తున్నారు. మృతురాలు మండలంలోని నందికంది గ్రామానికి చెందిన సారలక్ష్మిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News November 2, 2025

BREAKING: సుందర్ విధ్వంసం.. భారత్ విజయం

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సూర్య సేన 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో సుందర్ (23 బంతుల్లో 49*), జితేశ్ శర్మ (13 బంతుల్లో 22*) మెరుపులతో భారత్‌కు విజయాన్ని అందించారు. అంతకుముందు టిమ్ డేవిడ్, స్టాయినిస్ రాణించడంతో ఆస్ట్రేలియా 186 రన్స్ చేసింది. దీంతో 5 టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.

News November 2, 2025

తొలి ‘గే’ ప్రధానిగా రాబ్ జెట్టెన్!

image

నెదర్లాండ్స్‌ ఎన్నికల్లో D66 సెంట్రిస్ట్ పార్టీ ఇటీవల ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పార్టీ చీఫ్, 38ఏళ్ల రాబ్ జెట్టెన్ ప్రధాని పదవి చేపట్టనున్నారు. ఆ దేశ పిన్న వయస్కుడు, తాను ‘గే’ అని బహిరంగంగా చెప్పుకున్న రాబ్ PMగా నిలిచి రికార్డులకెక్కనున్నారు. ఎన్నికల ఫలితాలు చారిత్రాత్మకమని, గొప్ప బాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు. కాగా అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్‌తో జెట్టెన్ ఎంగేజ్‌మెంట్ 3ఏళ్ల కిందటే జరిగింది.

News November 2, 2025

VJA: మరి కాసేపట్లో జడ్జి ముందు జోగి రమేశ్ హాజరు

image

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇవాళ సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరికాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టి కష్టడి కోరే అవకాశం కనిపిస్తోంది. అంతకంటే ముంది విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు.