News March 6, 2025

సంగారెడ్డి: ‘ఇంటర్ పరీక్షలకు 97.5% హాజరు’

image

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలలో నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 18,852 మంది విద్యార్థులకు గాను 18,296 మంది విద్యార్థులు హాజరయ్యారని (97.5% )ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 556 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Similar News

News January 8, 2026

సిద్దిపేట: ఉక్కుపాదం మోపిన CP

image

గతేడాది Oct 6న సిద్దిపేట CPగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ తన మార్కును చూపించారు. అక్రమ ఇసుక, గంజాయి, డ్రగ్స్ రవాణ చేసే వారిపై కేసులు నమోదు చేసి, వారిపై ఉక్కుపాదం మోపారని జిల్లా వాసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంకన్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన మందుబాబులకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.10 వేల జరిమాన, జైలు శిక్ష పడేలా చర్యలు చేపట్టారు.

News January 8, 2026

మైనర్ షూటర్‌కు లైంగిక వేధింపులు.. బెడ్‌పైకి లాక్కెళ్లి..

image

నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై లైంగిక వేధింపుల <<18795742>>కేసులో<<>> బాధితురాలు(మైనర్) కీలక విషయాలు వెల్లడించారు. ‘గేమ్ అనాలసిస్ పేరుతో 5స్టార్ హోటల్‌కు పిలిచాడు. కుర్చీలో కూర్చున్న నన్ను బలవంతంగా బెడ్‌పైకి లాక్కెళ్లి లైంగిక దాడి చేశాడు. నేను ప్రతిఘటించడంతో కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించాడు. పైగా తనతో బాగా నడుచుకోవాలన్నాడు. జరిగిన విషయాన్ని అమ్మకు చెప్పడంతో PSకు తీసుకొచ్చింది’ అని తెలిపారు.

News January 8, 2026

రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.