News January 29, 2025

సంగారెడ్డి: ఇంటర్ విద్యార్థులకు ALERT

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎన్విరాన్మెంటల్ పరీక్షలు రేపు ఉదయం 10గం. నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్య అధికారి గోవిందరామ్ తెలిపారు. అదేవిధంగా 31న ఇంటర్మీడియట్ ఫస్టియర్, ఫిబ్రవరి 1న సెకండియర్‌కు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

Similar News

News December 3, 2025

PM మోదీకి CM రేవంత్ అందించిన వినతులివే

image

⋆HYD​ మెట్రో రెండో దశ విస్తరణను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్​ వెంచర్​గా చేపట్టేందుకు ఆమోదించాలి
⋆RRR ఉత్తర, దక్షిణ భాగం​ నిర్మాణానికి, మన్ననూర్​-శ్రీశైలం 4 వరుసల ఎలివేటేడ్​ కారిడార్‌కు అనుమతులివ్వాలి. RRR వెంట రీజనల్​ రింగ్​ రైలు ప్రాజెక్టును చేపట్టాలి
⋆HYD-అమరావతి-మచిలీపట్నం​ పోర్ట్ 12 లేన్ల​ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవే, HYD-BLR గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణానికి చొరవ చూపాలి

News December 3, 2025

ఏఐతో అశ్లీల ఫొటోలు.. X వేదికగా రష్మిక ఫిర్యాదు

image

అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన తన ఫొటోలు వైరల్ కావడంతో హీరోయిన్ రష్మిక Xలో ఘాటుగా స్పందించారు. ‘AIని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. AIని మంచి కోసం మాత్రమే వాడుకుందాం. ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలి’ అని కోరుతూ ‘Cyberdost’కు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.

News December 3, 2025

శివ స్వాములకు ఉచిత స్పర్శ దర్శనం: ఛైర్మన్

image

శివ స్వాములకు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు. బుధవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 7 వరకు స్పర్శ దర్శనాన్ని సాధారణ భక్తులకు రద్దు చేశామన్నారు. శివ స్వాములకు మాత్రం విడతల వారీగా దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరికీ సంతృప్తికర దర్శన భాగ్యం కల్పించటమే తన ధ్యేయమన్నారు.