News January 29, 2025

సంగారెడ్డి: ఇంటర్ విద్యార్థులకు ALERT

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎన్విరాన్మెంటల్ పరీక్షలు రేపు ఉదయం 10గం. నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్య అధికారి గోవిందరామ్ తెలిపారు. అదేవిధంగా 31న ఇంటర్మీడియట్ ఫస్టియర్, ఫిబ్రవరి 1న సెకండియర్‌కు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

Similar News

News November 28, 2025

ADB: 4 పంచాయతీల్లో సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నిక

image

సిరికొండ మండలంలో 4 గ్రామ పంచాయతీల సర్పం‌చ్‌లను గ్రామ పెద్దలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్నారు. రిమ్మలోని జంగుబాయి, రాయిగూడలో లక్ష్మణ్, కుంటగూడలో మీరబాయి, కన్నాపూర్‌లో బాలదేవిబాయిలను గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామ పెద్దలు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఒకే రోజు 4 గూడాల్లో ఏకగ్రీవం కావడం విశేషం. గిరిజన సంస్కృతికి అనుగుణంగా గ్రామస్థులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.

News November 28, 2025

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ WARNING

image

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం ద్వారా దక్కించుకోవాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలన్నారు. జిల్లాలో వేలం పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల వేలం నిర్వహించినా, ప్రయత్నించినా టోల్ ఫ్రీ నంబర్ 8978928637 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

News November 28, 2025

శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

image

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.