News January 29, 2025

సంగారెడ్డి: ఇంటర్ విద్యార్థులకు ALERT

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎన్విరాన్మెంటల్ పరీక్షలు రేపు ఉదయం 10గం. నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్య అధికారి గోవిందరామ్ తెలిపారు. అదేవిధంగా 31న ఇంటర్మీడియట్ ఫస్టియర్, ఫిబ్రవరి 1న సెకండియర్‌కు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

Similar News

News February 14, 2025

YCP మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు

image

AP: దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కారు అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బుధవారం రాత్రి ఓ వివాహ కార్యక్రమంలో ఘర్షణ జరిగిందని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 14, 2025

వివాదాస్పద కామెంట్స్.. సుప్రీంకు యూట్యూబర్

image

పేరెంట్స్ సెక్స్‌పై కామెంట్స్ <<15413969>>వివాదంలో<<>> తనపై నమోదైన FIRలను క్వాష్ చేయాలంటూ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. త్వరగా విచారించడం కుదరని, ప్రొసీజర్ ప్రకారమే చేపడతామని చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా స్పష్టం చేశారు. కాగా షెడ్యూల్ ప్రకారం రణ్‌వీర్ పిటిషన్ విచారణకు రావడానికి రెండు, మూడు రోజులు పట్టనుంది.

News February 14, 2025

సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం: సీఎం

image

నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఆయన చిత్రటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమన్నారు. ఆ మహానుభావుడి జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు. 

error: Content is protected !!