News March 11, 2025
సంగారెడ్డి: ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

8 మంది విద్యార్థులను అకారణంగా కొట్టినందుకు కంగ్టి కస్తూర్బా పాఠశాల నుంచి ఇద్దరిని విధుల నుంచి తొలగిస్తు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గణితం సీఆర్పీ సురేఖ, పీఈటీ రేణుకను విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థులను కొడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News March 12, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రత వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. వీర్నపల్లి 36.7°c, కోనరావుపేట 36.5°c, సిరిసిల్ల 36.1°c, ఇల్లంతకుంట 36.0°c, ఎల్లారెడ్డిపేట 36.0°c, చందుర్తి 35.4°c, వేములవాడ 35.0°c,రుద్రంగి 34.5°c, ముస్తాబాద్ 34.5°c లుగా ఉష్ణోగ్రత నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో 8 మండలాలకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News March 12, 2025
గ్రూప్ 2లో మెరిసిన ఆసిఫాబాద్ ఆణిముత్యం

కౌటాల మండల వాసి సాయిరాం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించారు. కాగా ఇప్పుడు బెజ్జూరు మండలం మొగవెల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తోటి మిత్రులు అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో కూడా విజయం సాధించినప్పటికీ దానిని వదులుకున్నట్లు సాయిరాం గౌడ్ తెలిపారు.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ములుగు జిల్లా ఎదురు చూస్తోంది!

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో ప్రధాన సమస్యగా ఉన్న గోదావరి కరకట్ట నిర్మించాలని, తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లా మొత్తం నీళ్లు తాగుకు, సాగుకు అందించాలని, పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.