News March 18, 2025

సంగారెడ్డి: ఈతకు వెళ్లిన యువకుడు మృతి

image

ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి మండలం కల్పగురు శివారులోని మంజీరా డ్యాంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆందోల్ మండలం కుమ్మరిగూడెంకు చెందిన నరేష్ తమ్ముడు నరేంద్రతో కలిసి ఆదివారం మంజీరా డ్యామ్‌కు వెళ్లారు. నరేష్ ఈత కొడుతుండగా నదిలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 13, 2025

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లు.. 31మందితో జేపీసీ

image

తీవ్ర నేరారోపణలతో అరెస్టై 30 రోజులు జైల్లో ఉండే ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లును పరిశీలించేందుకు BJP MP అపరాజిత సారంగీ నేతృత్వంలో 31 మంది సభ్యుల JPC ఏర్పాటైంది. ఇందులో BJP నుంచి 15 మంది, NDA పార్టీల నుంచి 11 మంది ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించడంతో మిగతా విపక్ష పార్టీలకు చోటు దక్కింది. వీటిలో ఎన్సీపీ-ఎస్పీ, అకాలీదళ్, ఎంఐఎం, వైసీపీ ఉన్నాయి.

News November 13, 2025

మా బాబును టీచర్లు చితకబాదారు: పేరెంట్స్

image

భద్రాచలం కూనవరం రోడ్‌లో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని టీచర్లు చితకబాదారని తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నపిల్లాడిని ఈ విధంగా ఎందుకు కొట్టారని అడిగేందుకు వచ్చిన తమను యాజమాన్యం కలవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు స్కూల్ వద్దకు చేరుకొని ధర్నాకు చేపట్టాయి.

News November 13, 2025

నానబెట్టిన మెంతులు మంచివేనా?

image

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.