News February 2, 2025
సంగారెడ్డి: ఈనెల 4న భౌతిక రసాయనశాస్త్ర ప్రతిభ పోటీ పరీక్ష

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో ఈనెల 4న నిర్వహించే బౌతిక రసాయన శాస్త్ర ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించున్నారు. ఈ పోటీలకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆహ్వానిస్తూ జిల్లా బౌతికరసాయన ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నరేందర్లు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో ఫోరం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News December 8, 2025
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

2026 మార్చి-ఏప్రిల్లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు చెల్లించే ఫీజు తేదీల గడువును పెంచినట్లు సత్యసాయి జిల్లా DEO క్రిష్టప్ప ఆదివారం తెలిపారు. అన్ని పాఠశాలల యాజమాన్యం గమనించాలని కోరారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125లు, ఒకేషనల్ విద్యార్థులు ఫీజుతో పాటు అదనంగా రూ.60లు, తక్కువ వయస్సు కోసం రూ.300లు చెల్లించాన్నారు.
News December 8, 2025
నకిలీ కాల్స్కి మోసపోవద్దు: కర్నూలు SP

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్వర్డ్, సీవీవీ ఫోన్లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్లు డౌన్లోడ్ చేయవద్దు అన్నారు.
News December 8, 2025
KG బేసిన్ సంపదకు రక్షణ కవచం.. జలాంతర్గాములకు సలాం..!

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చగల కృష్ణా-గోదావరి (KG) బేసిన్ మన తూ.గో జిల్లాకు గర్వకారణం. KG బేసిన్ చమురు, సహజవాయు నిల్వలకు, ONGC రిగ్గులకు నౌకాదళ జలాంతర్గాములు రక్షగా నిలుస్తున్నాయి. కడలిలో శత్రువుల కంటపడకుండా జలాంతర్గాములు మన ప్రకృతి వనరులను నిరంతరం కాపాడుతున్నాయి. నౌకలు, పోర్టులకు భరోసా కల్పిస్తున్న భారత నేవీకి జలాంతర్గామి దినోత్సవం సందర్భంగా జిల్లా వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


