News February 12, 2025

సంగారెడ్డి: ఈ నెల 17 నుంచి 10వ తరగతి పేపర్-2 పరీక్షలు

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 24 వరకు ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు.

Similar News

News December 24, 2025

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. 11 గ్రామాలు

image

రాష్ట్ర రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఐదు జిల్లాల పరిధిలోని 23 మండలాలలోని 121 గ్రామాల గుండా వెళ్లనుంది. పల్నాడు జిల్లా పరిధిలో పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగంగుంట్ల, జలాల్ పురం, కంభంపాడు, కాశిపాడు, మీదుగా అమరావతి మండలం ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు తదితర గ్రామాల నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వేళ్లనుంది.

News December 24, 2025

‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

image

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.

News December 24, 2025

తిరుపతిలో స్కాం.. AEO సూసైడ్‌పై చర్చ

image

తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో <<18647016>>స్కాం <<>>జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నాటి AEOపై క్రమశిక్షణా రాహిత్యం కేసు ఎందుకు నమోదైంది? రిటైరయ్యే కొన్ని రోజుల ముందే ఆయన సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన రిటైర్మెంట్ ముందు కూడా ఆ కేసు ఎందుకు క్లియర్ కాలేదనేది నేటికి ప్రశ్నగా మిగిలింది.