News July 13, 2024
సంగారెడ్డి: ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిపై కేసు

ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన ఇద్దరు మహిళలపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు మాధవి ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్కు చెందిన అనూరాధ, జహీరాబాద్కు చెందిన మరియమ్మపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఎన్.భాస్కర్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్సు, ఎఎన్ఎం ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నకిలీ ఉత్తర్వులు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News February 16, 2025
మెదక్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: కలెక్టర్

ట్రాఫిక్ నియమాలు పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మెదక్ కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదాల నివారణపై నేషనల్ హైవే, ఆర్అండ్బీ అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News February 15, 2025
సంగారెడ్డి: నేను పుస్తకాలు చదవలేదు: జగ్గారెడ్డి

యువతకు ఉపయోగపడే ఐటీఐఆర్ ప్రాజెక్టు తీసుకురావాలని తాను బీజేపీ ఎంపీలకు అడిగితే.. తనకు ఐటీఐఆర్ ఫుల్ఫాం తెలియదంటూ ఎద్దేవా చేయడం ఎంపీ రఘునందన్రావుకు తగదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిజంగా తాను పుస్తకాలు చదువుకోలేదని కేవలం ప్రజల మనస్తత్వం మాత్రమే చదివానని చెప్పారు. గాంధీ భవన్లో మీడీయాతో ఆయన మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కందికి ఐఐటీ తీసుకువచ్చానన్నారు.
News February 15, 2025
మెదక్: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.