News March 12, 2025
సంగారెడ్డి: ఉద్యోగాల సాధకుడు మనోహర్ రావు

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్కి చెందిన మనోహర్ రావు ప్రభుత్వ ఉద్యోగాల సాధకుడిగా మారారు. తాజాగా విడుదలైన గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో స్టేట్ 3వ ర్యాంక్ పొందాడు. ఇతడు 2017లో PGT స్టేట్ 3వ ర్యాంక్, 2017లో TGT స్టేట్ 1వ ర్యాంక్, 2019లో స్కూల్ అసిస్టెంట్ జిల్లా 2వ ర్యాంక్, 2020లో గ్రూప్-2లో స్టేట్ 3వ ర్యాంక్, 2025 లో JLలో స్టేట్ 4 ర్యాంక్ సాధించాడు.
Similar News
News December 19, 2025
HALలో 156 ఉద్యోగాలకు నోటిఫికేషన్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)లో 156 ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తారు. ఎలక్ట్రానిక్స్, ఫిట్టింగ్, గ్రిండింగ్, మెషినింగ్, టర్నింగ్ కేటగిరీల్లో ఖాళీలున్నాయి. సంబంధిత ట్రేడ్లో మూడేళ్ల NAC లేదా రెండేళ్ల ITI(+ NAC/NCTVT) పాసైన వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ DEC 25. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News December 19, 2025
పాలకొల్లు: ఐఈఎస్లో సత్తాచాటిన లంకలకోడేరు యువతి

పాలకొల్లు మండలం లంకలకోడేరుకు చెందిన కవిత బేబీ బుధవారం రాత్రి విడుదలైన యూపీఎస్సీ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్ ) ఫలితాల్లో 48వ ర్యాంకుతో సత్తాచాటింది. తాను తొలిసారి 2024లో యూపీఎస్సీ పరీక్షకు హాజరై విఫలమయ్యానని, పట్టుదలతో కృషి చేసి ఇప్పుడు మంచి ర్యాంకు సాధించానని కవిత పేర్కొన్నారు. టెలీకమ్యూనికేషన్ శాఖలో ఉద్యోగం సాధించాలనేది తన ఆశయమన్నారు. కవితకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News December 19, 2025
ధన్వాడ: తండ్రి అడుగుజాడల్లో.. కుమారుడి విజయం

ధన్వాడ మండలంలోని మందిపల్లిలో తండ్రి వారసత్వాన్ని కుమారుడు సురేందర్ రెడ్డి కొనసాగిస్తున్నారు. గతంలో ఆయన తండ్రి నరసింహారెడ్డి (1964-88) సుదీర్ఘకాలం సర్పంచ్గా సేవలందించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న సురేందర్ రెడ్డి.. 1994లో ఉప సర్పంచ్గా, 2001లో సర్పంచ్గా గెలిచారు. తాజాగా 2025 ఎన్నికల్లోనూ సర్పంచ్గా ఎన్నికై తమ కుటుంబానికి ఓటమి లేదని నిరూపించారు.


