News March 2, 2025

సంగారెడ్డి: ఉపరాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

image

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కందిలోని ఐఐటి-హైదరాబాద్ పర్యటన సందర్భంగా 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఐఐటి వద్ద బందోబస్తుకు వచ్చిన అధికారులతో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిల్లా సివిల్, సాయుధ బలగాలు, బాంబు డిస్పోజల్ టీమ్స్ పని చేస్తాయన్నారు.

Similar News

News November 15, 2025

GWL: రబీ సీజన్‌కు సాగునీరు ఇవ్వలేం- డిప్యూటీ సీఎం

image

కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర డ్యాం పరిధిలోని ఆయకట్టుకు రబీలో సాగునీరు ఇవ్వలేమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశంలో విషయాన్ని వెల్లడించారు. తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీబీ డ్యాం పరిధిలోని ఆయకట్టు రైతులు సహకరించాలన్నారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

News November 15, 2025

కంపెనీ ఒకటే.. కానీ మార్కెట్‌లో మాత్రం పోటీ!

image

మాతృ సంస్థలు ఒకటైనా అందులోని ప్రొడక్ట్స్ మార్కెట్‌లో పోటీ పడుతుంటాయి. ముఖ్యంగా మొబైల్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చైనాకు చెందిన BBK ఎలక్ట్రానిక్స్ Oppo, Vivo, OnePlus, Realme బ్రాండ్స్‌ను కలిగి ఉండగా.. ఇవి వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. Lifebuoy, Lux, Liril, Dove వంటి సోప్ బ్రాండ్స్‌తో పాటు హార్లిక్స్ & బూస్ట్ ప్రొడక్ట్స్‌ను Hindustan Unilever ఉత్పత్తి చేస్తుంది.

News November 15, 2025

నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

image

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల మౌలిక సదుపాయాల పనుల్లో ఏ మాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి పనికి స్పష్టమైన టైమ్‌లైన్‌ ఖరారు చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.