News March 2, 2025

సంగారెడ్డి: ఉపరాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

image

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కందిలోని ఐఐటి-హైదరాబాద్ పర్యటన సందర్భంగా 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఐఐటి వద్ద బందోబస్తుకు వచ్చిన అధికారులతో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిల్లా సివిల్, సాయుధ బలగాలు, బాంబు డిస్పోజల్ టీమ్స్ పని చేస్తాయన్నారు.

Similar News

News December 3, 2025

Way2News ఎఫెక్ట్.. స్పందించిన కోటంరెడ్డి

image

నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీలో గంజాయి ముఠా దాడిలో మృతి చెందిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోలేరా అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీనిపై రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పెంచలయ్య బిడ్డలను ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందజేస్తానని చెప్పారు.

News December 3, 2025

వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ టాప్

image

TG: వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో పంజాబ్ ఉండగా.. తెలంగాణ అధిగమించింది. అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వ్యవసాయం వాటా 6.7%కు పెరిగింది. వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు, అన్నదాతలకు అందిస్తోన్న ప్రోత్సాహకాల వల్లే ఇది సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంది.

News December 3, 2025

ఇప్పుడే విచారించలేం: హైకోర్టు

image

TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై ఇప్పటికిప్పుడు విచారించేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. ఈ మధ్యాహ్నం అన్ని పిటిషన్లు పరిశీలించాక తేదీ ప్రకటిస్తామని తెలిపింది. కాగా పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని పలువురు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌‌లో పిటిషన్లు దాఖలు చేయగా స్టే విధించేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే.