News March 2, 2025

సంగారెడ్డి: ఉపరాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

image

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కందిలోని ఐఐటి-హైదరాబాద్ పర్యటన సందర్భంగా 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఐఐటి వద్ద బందోబస్తుకు వచ్చిన అధికారులతో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిల్లా సివిల్, సాయుధ బలగాలు, బాంబు డిస్పోజల్ టీమ్స్ పని చేస్తాయన్నారు.

Similar News

News March 20, 2025

అలంపూర్: శ్రీ జోగులాంబ అమ్మవారి సేవలో నిరంజన్ రెడ్డి

image

ఐదో శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను ఈరోజు సాయంత్రం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉభయ ఆలయాలను దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల ద్వారా తీర్థప్రసాదం అందించి, ఆశీర్వచనం మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. తదనంతరం తుంగభద్ర నది, నవబ్రహ్మ ఆలయాలను దర్శించుకున్నారు. ఆయన వెంట దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ శేఖర్ ఆచారి ఉన్నారు.

News March 20, 2025

నెల్లూరు: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

image

నెల్లూరు కేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో గురువారం ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమైందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు.   ఏప్రిల్ మొదటి వారంలో మూల్యాంకనం పూర్తవుతుందని ఆర్ఐఓ తెలిపారు.

News March 20, 2025

జోగులాంబ గద్వాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

image

జోగులాంబ :@ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్@ఉండవెల్లి : జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి@ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ@ అలంపూర్ పట్టణంలో ఉచిత వైద్య శిబిరం @మల్దకల్: తిమ్మప్ప స్వామికి బంగారు బహూకరణ @రాజోలి: ఇసుక తవ్వకాలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్@వడ్డేపల్లి: తిరుమలకు పాదయాత్ర@ ఇటిక్యాల మండలంలో ఇదీ పరిస్థితి..!@ జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

error: Content is protected !!