News January 31, 2025

సంగారెడ్డి: ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

image

గుమ్మడిదల మండలం కానుకుంటకు చెందిన నరేశ్(28) మానసిక పరిస్థితి బాగోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మడిదల PSపరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. నరేశ్ ఎంబీఏ పూర్తి చేశాడు. గత 6ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా గురువారం తన ఇంట్లోని బెడ్రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. ఎస్ఐ ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 21, 2025

ALERT.. ప్రమాదంలో ఉమ్మడి ఆదిలాబాద్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాయు నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. కాలుష్యం సూచీ(AQI) నివేదిక ప్రకారం గురువారం ADBలో 131, ASFలో 125, NRMLలో 125, MNCLలో 123గా వాయు నాణ్యత నమోదైంది. సూచీల ప్రకారం.. వాయు నాణ్యత 0-50 (Green)ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు. ​51-100 (Yellow) శ్వాసకోశ వ్యాధి లక్షణాలు చూపవచ్చు. 101-150 (Orange) ఉంటే తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు. 151-200 (Red) ప్రమాదకరం. జాగ్రత్తగా ఉందాం.
SHARE IT

News November 21, 2025

కొత్తవలస MRO అప్పలరాజు సస్పెండ్

image

కొత్తవలస MRO పి.అప్పలరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తవలస మండలంలోని చిన్నపాలెం, కింతలపాలెం, కొత్తవలస గ్రామాల్లో భూములకు సంబందించి మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ PGRS ద్వారా కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ డిప్యూటీ తహశీల్దార్‌గా ఉన్న సునీతకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

News November 21, 2025

ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: TTD

image

AP: శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరులను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు NOV 29న ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు Global Hindu Heritage, savetemples.org సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అవి మోసపూరితంగా విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.