News February 8, 2025

సంగారెడ్డి: ‘ఎంఆర్సీలో అపార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

image

అపారు ఐడి కోసం ఆధార్ కార్డులో వచ్చిన తప్పులను సరిచేసేందుకు ఎంఆర్సీ కేంద్రాలలో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలనీ కోరుతూ టీటీయు యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డీఈవో సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News January 10, 2026

మేడారం జాతరలో 3199మంది వైద్య సిబ్బంది

image

ఈ సారి మేడారం జాతరలో 3199 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వీరిని నియమించుకుంటారు. మొత్తం 544 మంది వైద్యులలో 72మంది స్పెషలిస్టులు, 42మంది మహిళా డాక్టర్లు ఉంటారు. మరో 2150మంది పారామెడికల్ సిబ్బంది పని చేస్తారు. మేడారంలో 50పడకల ప్రధాన ఆస్పత్రితో పాటు 6 పడకలతో 30క్యాంపులు ఏర్పాటు చేస్తారు.

News January 10, 2026

VZM: సంక్రాంతి సందడి.. కిక్కిరిసిన బస్సులు

image

సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూలి పనుల నిమిత్తం వెళ్లిన వారు స్వగ్రామాలకు వస్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా VZM – VSKP రూట్లో రద్దీ ఎక్కువగా ఉంది. పండగ సందర్భంగా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

News January 10, 2026

క్యాల్షియం ఎక్కువగా ఎందులో దొరుకుతుందంటే?

image

కాల్షియం అనేది ఎముకల ఆరోగ్యాన్ని, బలాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్, డైరీ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. అలాగే ఆరెంజ్, ఆప్రికాట్, అంజీర పండ్లు, కివీ, స్ట్రాబెర్రీ, అరటిపండ్లలో క్యాల్షియం సమ‌ృద్ధిగా లభిస్తుంది. ఇవి ఎముకలు,దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన కాల్షియంను అందిస్తాయంటున్నారు నిపుణులు.