News February 19, 2025
సంగారెడ్డి: ‘ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి’

ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ మహేష్ దత్ ఎక్కా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకొని పనిచేయాలని చెప్పారు. శిక్షణకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.
Similar News
News December 11, 2025
APPLY NOW: CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(<
News December 11, 2025
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 700+ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 250+ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇండిపెండెంట్లు 150+ స్థానాల్లో గెలవగా.. BJP బలపరిచిన అభ్యర్థులు 50+ స్థానాల్లో విజయం సాధించారు.
News December 11, 2025
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో కాన్పు, తదనంతర మాతృ మరణాలను నిరోధించాలని కలెక్టర్ కృతికా శుక్లా వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా స్థాయి మాతృ మరణాల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు, గర్భిణుల ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా హైరిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించి, క్షేత్రస్థాయి సిబ్బంది ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


