News February 19, 2025
సంగారెడ్డి: ‘ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి’

ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ మహేష్ దత్ ఎక్కా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకొని పనిచేయాలని చెప్పారు. శిక్షణకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.
Similar News
News December 13, 2025
జగిత్యాల: ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

జగిత్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన ముగ్గురు ఉద్యోగులను కలెక్టర్ సత్య ప్రసాద్ సస్పెండ్ చేశారు. DEC 11న జరిగిన ఫేజ్-1 విధులకు వీరు హాజరుకాలేదు. దీనిపై జారీ చేసిన షోకాజ్ నోటీసులకు వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సస్పెన్షన్ వేటువేశారు. సస్పెండైన వారిలో ఇద్దరు జూనియర్ లెక్చరర్లు, ఒక స్కూల్ అసిస్టెంట్ ఉన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
News December 13, 2025
మరికాసేపట్లో మీడియా ముందు నెల్లూరు మేయర్

నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై రాజకీయం వేడెక్కింది. ఉదయం ఒక కార్పొరేటర్.. సాయంత్రం మరొక కార్పొరేటర్ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. దీనిపై మేయర్ స్రవంతి మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. ఆమె ఏం మాట్లాడుతారు.. ఎవరి గురించి మాట్లాడుతారో ఉత్కంఠంగా నగర, జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
News December 13, 2025
గంగాధర: ఓటర్లకు డబ్బులు పంచిన వారిపై కేసు నమోదు

KNR(D) గంగాధర మండలం వెంకంపల్లి గ్రామంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అభ్యర్థి సహా ముగ్గురిపై కేసు గంగాధర పీఎస్లో నమోదయింది. ఈ నెల 10న ఓటర్లకు డబ్బులు పంచుతున్న గుండవేని నర్సయ్యను ఎఫ్ఎస్టీ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.32,000 నగదును, ఎలక్ట్రిక్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి గుండవేని లావణ్యతో పాటు ఆమె సోదరుడి ఆదేశాల మేరకు ఈ పని చేసినట్లు తేలడంతో ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు.


