News March 4, 2025
సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలు.. అంజిరెడ్డి ముందంజ

కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. 4వ రౌండ్ అనంతరం ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 30,961ల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 25,363ల ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 21,248ల ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,598ల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News November 20, 2025
HYD: మార్చి 2026 నాటికి మెట్రో లైన్ క్లియర్

HYDలో సుమారు 162 కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఏ కారిడార్లు సాధ్యమో, విస్తరణ స్థాయి ఎంత వరకూ ఉండాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాలతో దశంలో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయనుందని మంత్రి HYDలో పేర్కొన్నారు.
News November 20, 2025
24 నుంచి కడప జిల్లాలో YS జగన్ పర్యటన.?

ఈనెల 24 నుంచి 3 రోజులపాటు కడప జిల్లాలో YS జగన్ పర్యటిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు జిల్లాలో పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సోమవారం, మంగళవారం, బుధవారం ఆయన పులివెందులతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని, జగన్ పర్యటన వివరాలు అధికారికంగా రావాల్సి ఉందని YCP నాయకులు పేర్కొన్నారు.
News November 20, 2025
HYD: DEC30 నుంచి వైకుంఠద్వార దర్శనం

TTD వైకుంఠ ద్వార దర్శనం 2025 కోసం DEC 30 నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు HYD అధికారి జయేష్ తెలిపారు. భక్తుల కోసం మొత్తం 164 గంటలకుపైగా దర్శన సమయం కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో కేవలం e-Dip టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుంది. ఈ టైమ్లో ఆఫ్లైన్ టోకెన్లు పూర్తిగా రద్దు చేశారు.


