News March 4, 2025
సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలు.. అంజిరెడ్డి ముందంజ

కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. 4వ రౌండ్ అనంతరం ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 30,961ల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 25,363ల ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 21,248ల ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,598ల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News November 27, 2025
ఇల్లు మూలల ఆధారంగా ఉంటే ఏ దిక్కున పడుకోవాలి?

ఇల్లు మూలలకు ఉన్నప్పుడు నైరుతి మూలకు తల, ఈశాన్య మూలకు కాళ్లు పెట్టుకుని పడుకోవడం మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది చక్కటి నిద్రకు, ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ‘నైరుతి స్థిరమైన శక్తినిస్తుంది. ఈశాన్యం నుంచి పాదాల ద్వారా శుభకరమైన కాస్మిక్ శక్తిని స్వీకరించడానికి సహాయపడుతుంది. అలాగే పనుల పట్ల ఏకాగ్రతను పెంచుతుంది’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 27, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2311, కనిష్ఠ ధర రూ.1721; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2100, కనిష్ఠ ధర రూ.1800; వరి ధాన్యం (BPT) ధర రూ.2151; వరి ధాన్యం (HMT) ధర రూ.2211; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2971, కనిష్ఠ ధర రూ.2060గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 27, 2025
నామినేషన్కు ముగ్గురికి మాత్రమే అనుమతి: కలెక్టర్

నామినేషన్ దాఖాలుకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ హైమావతి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 508 గ్రామపంచాయితీలు, 4508 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, 27 నవంబర్ గురువారం మొదటి విడత నామినేషన్ ప్రక్రియ మొదలయ్యిందన్నారు.


