News March 26, 2025

సంగారెడ్డి: ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు నెల 31లోగా పీజీ చెల్లించాలని కలెక్టర్ వల్లురు క్రాంతి సూచించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ. మున్సిపాలిటీ, పంచాయతీల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రచారం చేయాలని చెప్పారు. ఈ నెల31లోగా చెల్లించిన వారికి 25% డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. 100% ఫీజు చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 26, 2026

ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

image

ఏలూరు జిల్లావ్యాప్తంగా 56 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 16,357 మంది విద్యార్థులకు గాను 15,972 మంది హాజరుకాగా, 385 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 98 శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పటిష్ట నిఘా ఏర్పాటు చేశాయి.

News February 26, 2026

జనగామ: ఇంటర్ EXAMS.. 76 మంది గైర్హాజరు

image

జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 3,999 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, వారిలో 3,923 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ నోడల్ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. వివిధ కారణాల వల్ల 76 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News February 26, 2026

NLR: గురుకులాల ప్రవేశ పరీక్ష వాయిదా

image

గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.