News March 19, 2025
సంగారెడ్డి: ఎల్ఆర్ఎస్ పరిష్కారం వేగవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలోని మునిసిపాలిటీలు, పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్ పరిష్కారం వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ ఫీజు ఈ నెల 3వ తేదీ వరకు చెల్లించిన వారికి 25% రిబేట్ లభిస్తుందని చెప్పారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చదివి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News September 19, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> రాష్ట్ర స్థాయి క్రీడలకు పాలకుర్తి విద్యార్థి ఎంపిక
> జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు
> యూరియా నిల్వలను పరిశీలించిన అదనపు కలెక్టర్
> కడియం రాజీనామా చేయాలని ఉత్తరాల ఉద్యమం
> రఘునాథపల్లిలో గంజాయి పట్టివేత
> అలుగు పోస్తున్న బొమ్మెర చెరువు
> జనగామ: ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
> USAలో బతుకమ్మ పండగకు మంత్రులకు ఆహ్వానం
> 30 లోపు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్
News September 19, 2025
కాగజ్నగర్: విజేతలకు బహుమతుల ప్రదానం

కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీ గ్రౌండ్లో నిర్వహించిన కబడ్డీ టోర్నీ విజేతలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుతో కలిసి ఈరోజు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కాగజ్నగర్ సెవెన్ స్టార్స్ జట్టుకు రూ.50,000, ద్వితీయ బహుమతి సిర్పూర్ బజరంగ్దళ్ టీమ్కు రూ.25,000, తృతీయ బహుమతి బెజ్జూరు మండలం అర్కగూడా టీంకు రూ.15,000 నగదుతో పాటు షీల్డ్లు అందజేశారు.
News September 19, 2025
పెద్దపల్లి: మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలి: DMHO

మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. గురువారం పట్టణ మాతా శిశు కేంద్రంలో ‘స్వస్థ నారి స్వశక్తి పరివార్’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం 35 ఏళ్ల పైబడిన మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అన్ని పరీక్షలు, వైద్య సేవలు అందిస్తున్నదని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.