News March 23, 2025
సంగారెడ్డి: ఏప్రిల్ 3 నుంచి పదోన్నతి పొందిన టీచర్లకు శిక్షణ: డీఈవో

జిల్లాలో నూతనంగా పదోన్నతి పొందిన గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఏప్రిల్ 3 నుంచి 4 వరకు రెండు రోజుల పాటు పాఠశాల అభివృద్ధి, విద్యా బోధన తదితర అంశాలపైన మెదక్లో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఈ శిక్షణను ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 18, 2025
వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 83,013 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 25,423 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు కూడా భారీగా లాభాలు ఆర్జించాయి.
News September 18, 2025
పటాన్ చెరు: ఎఫ్ఎల్ఎన్ను పగడ్బందీగా నిర్వహించాలి: డీఈఓ

పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని వీకర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. డీఈఓ మాట్లాడుతూ.. ఎఫ్ఎల్ఎన్ను పగడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులు గ్రంథాలయ పుస్తకాలను వినియోగించుకునేలా చూడాలని పేర్కొన్నారు.
News September 18, 2025
సంచలన చిత్రం మిరాయ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండి కుర్రాడే

హనుమాన్, మిరాయ్ చిత్రాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఉండి గ్రామానికి చెందినవారు. గ్రామ కరణం తాడికొండ లక్ష్మీ నరసింహం మనవడైన గౌర హరి, తన సంగీత ప్రతిభతో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు. 8చిత్రాలకు పైగా సంగీతం అందించగా, వీటిలో హనుమాన్, మిరాయ్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. గౌర హరిది ఉండివాడు కావడం గర్వంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.