News March 30, 2025
సంగారెడ్డి: ఒక్కరోజు వ్యవధిలోనే దంపతులు మృతి

ఒక్కరోజు వ్యవధిలోనే దంపతులు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని గుండ్ల మాచనూరు గ్రామానికి చెందిన ఆండాలు(58) శుక్రవారం గుండెపోటుతో మరణించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త దుర్గయ్య(65) అనారోగ్యానికి గురై శనివారం మృతి చెందాడు. దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 28, 2025
వనపర్తి: అంతరాలు లేని సమాజం కోసం విద్యార్థులు పోరాడాలి

వనపర్తిలో జరిగిన పీడీఎస్యూ (PDSU) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుల, మత, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. శాస్త్రీయ ఆలోచనలతో సమానత్వ భావనను బలోపేతం చేయాలని విద్యార్థులకు సూచించారు.
News October 28, 2025
సత్యసాయి జయంతి వేడుకలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

పుట్టపర్తి పట్టణంలో నవంబర్ 23న సత్యసాయి 100వ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రిక అందించారు. మంగళవారం విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ RJ రత్నాకర్ మర్యాదపూర్వక కలిసి ఆయనను ఆహ్వానించారు. జయంతి వేడుకలకు పీఎంతో కలిసి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.
News October 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 49 సమాధానాలు

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన భక్తుడు ‘కంచర్ల గోపన్న’.
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ‘భువర్లోకం’.
3. రామసేతు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ‘నల-నీల’ అనే ఇద్దరు వానరులు.
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ‘సంజయుడు’.
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ‘గంగ’.
<<-se>>#Ithihasaluquiz<<>>


