News July 24, 2024

సంగారెడ్డి: ఒక్క మెసేజ్‌.. రూ.98.40 లక్షలు కొట్టేశారు..!

image

ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో ఆదాయం లభిస్తుందన్న ఆశతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.98.40 లక్షలు పోగొట్టుకున్నాడు. పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాలు.. AR బృందావనం కాలనీలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫోన్‌కు గత నెల 17న ఓ మెసేజ్ వచ్చింది. లింక్ క్లిక్ చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసేందుకు ముందుగా రూ.10వేలతో ప్రారంభించి, విడతల వారీగా రూ.98.40లక్షలు పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. జర జాగ్రత్త!

Similar News

News December 4, 2025

మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

News December 4, 2025

మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

News December 4, 2025

మెదక్: 2వ విడత బరిలో 670 మంది అభ్యర్థులు

image

మెదక్ జిల్లాలో రెండవ విడతలో జరగనున్న 8 మండలాల్లోని 149 గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 670 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చేగుంట (134), చిన్న శంకరంపేట్ (113), రామాయంపేట (87) మండలాల్లో అత్యధిక అభ్యర్థులున్నారు. శనివారం నాటి ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.