News December 11, 2024
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందేందుకు నేడే ఆఖరు

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు నేడే ఆఖరి తేదీ అని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ శోభారాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందేందుకు ఇది చివరి అవకాశమన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రములో సంప్రదించాలని సూచించారు.
Similar News
News November 26, 2025
మెదక్: ఏడుపాయల టెండర్ ఆదాయం రూ.3.75 లక్షలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం కార్యాలయంలో బుధవారం మహా శివరాత్రి జాతర సీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఈఓ చంద్రశేఖర్, మెదక్ జిల్లా దేవాదాయ శాఖ పరివేక్షకుడు వెంకట రమణ సమక్షంలో వేలం జరిగింది. జాతరలో కొబ్బరి ముక్కలు పోగు హక్కు రూ.3.75 లక్షలకు నాగ్సాన్పల్లి పి.మల్లేశం దక్కించుకున్నారు. మిగతా టెండర్లకు సరైన పాటలు రాక వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు.
News November 26, 2025
MDK: ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: SEC

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీసీ నిర్వహించి, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. టి-పోల్లో రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు అప్డేట్ చేయాలని, ఫిర్యాదులు మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నామినేషన్లు నవంబర్ 27–29 స్వీకరణపై మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పారు.
News November 26, 2025
మెదక్: లోకల్ ఫైట్.. మన ఊరిలో ఎప్పుడెప్పుడంటే

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదలైంది.
మెదటి విడత(Dec 11న)లో అల్లాదురం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట.
రెండో దఫా(14న)లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంరంపేట, మెదక్.
మూడో విడత(17న)లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కౌల్చారం, శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.


