News April 4, 2025
సంగారెడ్డి: ‘ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

ఈనెల 20 నుంచి 26 వరకు జరిగే ఓపెన్ స్కూల్ 10 ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. కలెక్టరేట్లో పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షల్లో చూచి రాతకు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఓపెన్ స్కూల్ సమన్వయకర్త వెంకటస్వామి పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
KNR: NOV నుంచి అంగన్వాడీ పిల్లలకు ‘బ్రేక్ ఫాస్ట్’

అంగన్వాడీల చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. NOV 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నుంచి ఈ ప్రోగ్రాంను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఇప్పటికే మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలందాయి. కాగా, ఉమ్మడి KNRలో 3,135 అంగన్వాడీలు ఉండగా, 74,550 మంది చిన్నారులు చదువుతున్నారు. మరోవైపు చిన్నారులకు, సిబ్బందికి 2జతల చొప్పున యూనిఫాంలను ప్రభుత్వం ఇవ్వనుంది.
News September 19, 2025
NLG: ప్రభుత్వ టీచర్లకు టెట్ టెన్షన్

ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వ టీచర్లుగా కనీసం ఐదేళ్ల సర్వీస్ ఉన్న వారంతా టెట్ ఉత్తీర్ణత కావాల్సిందే అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. ఒక నల్గొండ జిల్లాలోనే సుమారుగా 2 వేల మందికి పైగా టీచర్లకు టెట్ అర్హత లేదని సమాచారం. అర్హత సాధించని వారు తమ ఉద్యోగాలు వదులుకోవాలని తీర్పులో పేర్కొనడంతో ఉపాధ్యాయ లోకం గందరగోళంలో పడింది.
News September 19, 2025
GWL: మావోయిస్ట్ మహిళా నేతకు స్థానిక సర్టిఫికెట్

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత పోతుల కల్పన @ సుజాతకు గురువారం గట్టు రెవెన్యూ ఆఫీసర్లు నేటివ్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోగా ఆఫీసర్లు ఎంక్వయిరీ చేశారు. ఆమె 6వ తరగతి వరకు అయిజ, ఇంటర్ గద్వాలలో చదువుకున్నట్లు నిర్ధారించారు. గట్టు మండలం పెంచికలపాడు తిమ్మారెడ్డి, వెంకమ్మల కుమార్తెగా నిర్ధారించి సర్టిఫికెట్ అందజేశారు. కాగా ఆమె ఈనెల 13న హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.