News April 4, 2025

సంగారెడ్డి: ‘ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఈనెల 20 నుంచి 26 వరకు జరిగే ఓపెన్ స్కూల్ 10 ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. కలెక్టరేట్లో పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షల్లో చూచి రాతకు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఓపెన్ స్కూల్ సమన్వయకర్త వెంకటస్వామి పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

నిరుద్యోగులకు ALERT.. మార్చి 9 నుంచి అగ్నివీర్ ర్యాలీ

image

AP, TGలకు చెందిన నిరుద్యోగులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. గుంటూరులోని ANUలో ఫిజికల్ టెస్టులు ఉంటాయి. మార్చి 9, 10 తేదీల్లో మహిళలు, 12, 13 తేదీల్లో పురుషులు నేరుగా హాజరుకావొచ్చు. 2005 జులై 2-2009 జనవరి 2 మధ్య జన్మించిన, ఇంటర్/డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. సర్టిఫికెట్ల జిరాక్స్‌లు, 10 ఫొటోలు తీసుకెళ్లాలి. రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

News February 25, 2026

ఇంటర్ పరీక్షల సందర్భంగా పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ

image

ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్షా సమయాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాలలో 163 బీఎన్ఎస్ యాక్ట్ అమల్లో ఉందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచుతున్నామని వెల్లడించారు.

News February 25, 2026

వేంపల్లి: నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వైఎస్ జగన్

image

వేంపల్లి మండలం నందిపల్లెలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన పులివెందులలోని తన నివాసానికి చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం రెండు గంటలకు ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.