News March 10, 2025

సంగారెడ్డి: కడుపునొప్పితో వివాహిత సూసైడ్

image

కడుపునొప్పి భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. SI రంజిత్ రెడ్డి వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మం. మర్పెల్లికి చెందిన మహేశ్వరి(27)కి కౌడిపల్లి మం. మహమ్మద్‌నగర్‌కు చెందిన అనిల్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. కొడుకు పుట్టినప్పటి నుంచి మహేశ్వరి కడుపునొప్పితో బాధపడుతుంది. పలుచోట్ల చికిత్స చేయించినా తగ్గలేదు. మనస్తాపం చెందిన ఆమె నిన్న ఇంట్లో ఉరేసుకుంది. మహేశ్వరి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News January 11, 2026

నిఖత్ జరీన్‌కు గోల్డ్ మెడల్

image

గ్రేటర్ నోయిడాలో (UP) జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మహ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్స్‌ సాధించారు. 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్.. 2023 ప్రపంచ ఛాంపియన్ నితూ ఘాంగాస్‌ను ఓడించి తన మూడో నేషనల్ టైటిల్‌ను గెలుచుకున్నారు. మరోవైపు హుసాముద్దీన్ 60KGల విభాగంలో సచిన్ సివాచ్‌పై విజయం సాధించారు. 75KGల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ సైతం గోల్డ్ మెడల్ సాధించారు.

News January 11, 2026

ఈ టిప్స్‌తో నిద్రలేమి సమస్యకు చెక్!

image

* ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి.
* బెడ్‌రూమ్‌లో 18-22 డిగ్రీల టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి.
* గదిలో లైటింగ్ ఎక్కువగా లేకుండా చూసుకుంటే నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది.
* కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్/ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
* విటమిన్ D, B12 లోపాలు లేకుండా చూసుకోవాలి.
* రేపటి పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆలోచనలు తగ్గి బాగా నిద్ర పడుతుంది.

News January 11, 2026

కుమారుడి డ్రగ్స్ కేసు.. తొలిసారి స్పందించిన MLA ఆది

image

తన కుమారుడు డ్రగ్స్ కేసుపై MLA ఆదినారాయణరెడ్డి తొలిసారి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘సుధీర్ లండన్‌లో MBA చేశాడు. అక్కడి కల్చర్‌ ఇండియాలో వద్దని చెప్పా. నా మాట వినలేదు. పోలీసుల పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ఈ కేసులో 100% రాజకీయ కోణం ఉంది. విక్టింను పట్టుకుని నన్ను విక్టిం చేయాలని చాలా మంది దుష్ర్పచారానికి దిగారు. అయినా నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ ఘాటుగా స్పందించారు.