News August 14, 2024

సంగారెడ్డి కలెక్టరేట్‌లో ధరణి సహాయ కేంద్రం

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ధరణికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఫిర్యాదులు ఎవరికి చేయాలో తెలియక వచ్చిన వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు నిరాశతో విని తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ధరణి సహాయ కేంద్రాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఏర్పాటు చేయించారు. సమస్యలపై రైతులు ఇక్కడ సంప్రదించవచ్చని తెలిపారు.

Similar News

News November 15, 2025

మెదక్: గ్రామాల్లో బెంబేలెత్తిస్తున్న వీధికుక్కలు!

image

వీధి కుక్కల బెరద రోజు రోజుకు గ్రామాల్లో అధికమవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది వీధి కుక్కల బారిన పడిన వారు ఉన్నారు. అయితే కుక్కల కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుందని డాక్టర్లు కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో ఒక్కో కుక్క గుంపులో సుమారు 20 నుంచి 30 కుక్కల సంచారిస్తున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్ట్ వీధి కుక్కలను నియంత్రించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

News November 15, 2025

RMPT: Way2News ఎఫెక్ట్.. కేసు నమోదు

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో అకారణంగా మద్యం మత్తులో బాలుడిపై దాడి చేసిన పినతండ్రి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. <<18287012>>Way2Newsలో వచ్చిన కథనానికి<<>> స్పందించిన ఎస్ఐ బాలరాజు వివరాలు సేకరించారు. మద్యం మత్తులో పినతండ్రి నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసినట్టు గుర్తించామని, సత్యనారాయణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 15, 2025

RMPT: Way2News ఎఫెక్ట్.. స్పందించిన DWO

image

Way2News కథనానికి జిల్లా మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి స్పందించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో ‘<<18287012>>మద్యం మత్తులో కుమారుడిపై దాడి<<>>’ అని Way2Newsలో కథనం రావడంతో స్పందించిన DWO పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాలుడిపై దాడి చేసిన పినతండ్రిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. బాలుడికి సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు.