News March 9, 2025
సంగారెడ్డి కలెక్టరేట్లో రేపు ప్రజావాణి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
గీసు’కొండ’లో రెండు కాంగ్రెస్ల మధ్య పోటీ!

కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొంది. కానీ వరంగల్ జిల్లాలో కొండా కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మధ్య తీవ్రంగా పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఎక్కడ లేని విధంగా గీసుగొండలో అధికార పార్టీలో రెండు గ్రూపుల చిచ్చు తీవ్ర స్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల్లో గీసుగొండలో బీఆర్ఎస్ సైడ్ అయి, రెండు కాంగ్రెస్ల అభ్యర్థుల మధ్యే పోటీ జరుగుతోందని ప్రచారం అవుతోంది.
News December 1, 2025
చొప్పరివారిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

నల్గొండ జిల్లా చండూరు మండలం చొప్పరివారిగూడెం సర్పంచ్గా జాల వెంకన్నను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు కల్పించిన గౌరవానికి ఆయన సంతోషించి, గ్రామ అభివృద్ధికి తన వంతుగా రూ.18.16 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయాన్ని కొనసాగించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు.
News December 1, 2025
ASF: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.


