News April 15, 2025

సంగారెడ్డి: కాపురానికి రమ్మంటే రావడం లేదని హత్య

image

భార్యను భర్త <<16097179>>హత్య చేసిన<<>> ఘటన పటాన్ చెరులో జరిగిన విషయం తెలిసిందే. వివరాలు.. జిన్నారం(M) కిష్టాయిపల్లికి చెందిన సురేశ్‌కు పటాన్ చెరు (M) పెద్ద కంజర్ల వాసి రమీలా(24)తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా తల్లి దగ్గరికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని అత్తగారి ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవ పడి రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది.

Similar News

News November 21, 2025

ADB: జాతీయ రహదారిని అడ్డుకోవడం చట్టరీత్య నేరం: డీఎస్పీ

image

జాతీయ రహదారిపై అత్యవసర సేవల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయని వాటిని అడ్డుకోవడం చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని ADB డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. యువత కేసుల బారిన పడకుండా వారి భవిష్యత్తులను నాశనం చేసుకోకూడదని తెలిపారు. అంబులెన్స్, అగ్నిమాపక, వాహనాలు ఆస్పత్రిలకు వెళ్లేవారికి అసౌకర్యం కలిగే చర్యలు చేయవద్దన్నారు. యువత కేసుల వల్ల ఉద్యోగ అవకాశాలను కోల్పోకుండా ఉండాలని సూచించారు.

News November 21, 2025

మూవీ అప్డేట్స్

image

* విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ డిసెంబర్ 15న సెట్స్‌పైకి వెళ్లే అవకాశం. ‘మన శంకర వరప్రసాద్ గారు’లో తన కామియో షూటింగ్ పూర్తి కాగానే వెంకటేశ్ ఈ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతారని టాక్.
* ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ మ్యాన్-3. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.
* ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని రాజాసాబ్ టీమ్ వెల్లడి.

News November 21, 2025

MNCL: కంప్యూటర్ల విడి భాగాలు విక్రయం

image

మంచిర్యాల జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సేకరించిన ఉపయోగంలో లేని కంప్యూటర్ల విడి భాగాలను విక్రయించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 717 మానిటర్లు, 316 సీపీయు, 296 యుపిఎస్, 70 ప్రింటర్స్, 26 కంప్యూటింగ్ యూనిట్స్, 636 కేబుల్ కీ బోర్డ్స్, 288 మౌస్ ఉన్నట్లు పేర్కొన్నారు. కొనదలిచిన వారు రూ.10 వేలు ధరావత్తు సొమ్మును కొనే ధర కోడ్ చేసి సీల్డ్ కవర్‌లో ఈ నెల 25 సాయంత్రం 4 గంటల లోపు సమర్పించాలని సూచించారు.