News April 15, 2025

సంగారెడ్డి: కాపురానికి రమ్మంటే రావడం లేదని హత్య

image

భార్యను భర్త హత్య చేసిన ఘటన పటాన్ చెరులో జరిగిన విషయం తెలిసిందే. వివరాలు.. జిన్నారం(M) కిష్టాయిపల్లికి చెందిన సురేశ్‌కు పటాన్ చెరు (M) పెద్ద కంజర్ల వాసి రమీలా(24)తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా తల్లి దగ్గరికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని అత్తగారి ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవ పడి రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది.

Similar News

News December 16, 2025

విజయనగరం: దేశంలో తొలి AAD ఎడ్యుకేషన్ సిటీ.!

image

విజయనగరం జిల్లా భోగాపురంలో దేశంలోనే తోలి ఏవియేషన్ ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఏడ్యుకేషన్ సిటీని విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో నేడు లాంఛనంగా మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. జీఎంఆర్-మాన్సాస్ ఆధ్యర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సమీపంలో 160 ఎకరాల స్థలంలో స్థాపించనున్నారు. ఈకార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొనున్నారు. ఇప్పటికే లోకేశ్ విశాఖకు చేరుకున్నారు.

News December 16, 2025

బేబీ వెయిట్ పెరగడానికి ఏం చేయాలంటే?

image

గర్భంలో పిండం బరువు ఎందుకు పెరగట్లేదో ముందుగా తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బేబీ ఊపిరితిత్తులు సరిగా లేకపోతే ఇంజక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్లు సూచించిన స్కాన్‌లు ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వేరుశెనగలు, రాజ్మా, మిల్క్, ఎగ్స్, మాంసం, పప్పులు, పనీర్ వంటి ప్రొటీన్ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

News December 16, 2025

ఆరోగ్యం కోసం కుంకుమ పెట్టుకుందామా?

image

పసుపుతో తయారయ్యే కుంకుమ సహజంగా క్రిమి సంహారినిగా పనిచేసి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. కుంకుమలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి మెరుపు తీసుకువస్తాయి. అలాగే డెడ్ సెల్స్‌ను పోరాడతాయి. కుంకుమ అనేక చర్మ సంబంధిత వ్యాధులను, చికాకులను దూరం చేస్తుంది. నుదిటిపై కుంకుమ ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది.