News April 11, 2025
సంగారెడ్డి: కాసేపట్లో ఇంటికి.. అంతలోనే విద్యార్థి మృతి

కొండాపూర్లో పిడుగు పడి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. గంగారానికి చెందిన సంతోశ్ సదాశివపేటలో ఐటీఐ చదువుతున్నాడు. కళాశాల నుంచి తన స్నేహితులతో ఇంటికి వస్తుండగా భారీ వర్షం రావడంతో ఒక చెట్టు కింద ఆగారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపడి సంతోశ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 17, 2026
జీవీఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన చరిత్ర(2/2)

విశాఖ జీవీఎంసీలో పలుమార్లు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 2000-2007 ఏళ్ల మధ్య ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలన సాగింది. 2012 నుంచి 2021 వరకు సుమారు 9 ఏళ్లపాటు కూడా ఎన్నికలు జరగక జిల్లా కలెక్టర్లే ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. ఈ సమయంలో కార్పొరేషన్ పాలన, అభివృద్ధి పనులు అధికారుల ఆధ్వర్యంలోనే సాగాయి. 2021లో ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టి అయిదేళ్ల ప్రయాణం పూర్తి చేశారు.
News March 17, 2026
జీవీఎంసీలో ప్రత్యేక పాలన అమలు(1/2)

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో ఎన్నికైన మేయర్తో పాటు కార్పొరేటర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలన అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికైన ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో కార్పొరేటర్ల అధికారాలు కూడా ముగిశాయి.
News March 17, 2026
అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్ను సర్కార్ సిద్ధం చేస్తోంది.


