News February 1, 2025

సంగారెడ్డి: కేంద్ర మంత్రుల మాటలు కోతలే.. నిధులేవి: జగ్గారెడ్డి

image

తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి ఇద్దరు కేంద్ర మంత్రులు చేస్తే బడ్జెట్లో మాత్రం అన్యాయం చేశారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. ఇద్దరు కేంద్ర మంత్రుల మాటలు కోతలేనని.. నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు.

Similar News

News December 5, 2025

నల్గొండ: ఎన్నికల వేళ.. జోరందుకున్న దావత్‌లు!

image

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బరిలో ఉన్న అభ్యర్థులు విందు, వినోదాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో మటన్ కిలో రూ.800 నుంచి రూ.1,000 ధర పలుకుతుండడంతో చికెన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. కిలో చికెన్ రూ.220, స్కిన్ లెస్ కిలో రూ.250 పలుకుతోంది. లిక్కర్ అమ్మకాలూ విపరీతంగా పెరిగాయి.

News December 5, 2025

BREAKING: నల్గొండ: లంచం తీసుకుంటూ దొరికిన డిప్యూటీ MRO

image

లంచం తీసుకుంటూ ఓ డిప్యూటీ తహశీల్దార్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా చండూరు తహశీల్దార్ ఆఫీస్‌లో డిప్యూటీ MRO రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఆయనను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 5, 2025

జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ జానకి షర్మిల

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగ్‌లు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని స్పష్టం చేశారు. అలాగే ఆయుధాలు, పేలుడు పదార్థాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు వినియోగించడం కూడా నిషేధమని చెప్పారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.