News April 16, 2025

సంగారెడ్డి: కేజీబీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు

image

జిల్లాలోని 22 కేజీబీవీలో ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ప్రకటనలో తెలిపారు. కేజీబీవీల్లో చదివే బాలికలకు స్కిల్, స్పోకెన్ ఇంగ్లీష్, తదితర కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 15, 2025

ఆస్ట్రేలియా అంటే వీరికి పూనకాలే..

image

ఆస్ట్రేలియాపై వన్డేల్లో విరాట్, రోహిత్‌లకు మంచి రికార్డులు ఉన్నాయి. అత్యధిక రన్స్ చేసిన లిస్టులో సచిన్, కోహ్లీ, రోహిత్ టాప్-3లో ఉన్నారు. సచిన్ 71 ఇన్నింగ్సుల్లో 3,077 రన్స్, 9 సెంచరీలు చేశారు. కోహ్లీ 50 ఇన్నింగ్సుల్లో 2,451, రోహిత్ 46 ఇన్నింగ్సుల్లో 2,407 పరుగులు చేశారు. విరాట్, హిట్‌మ్యాన్ చెరో 8 సెంచరీలు బాదారు. OCT 19 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లోనూ RO-KO రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

News October 15, 2025

వనపర్తి: క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే

image

వనపర్తి జిల్లా అండర్ 14, 17 బాల, బాలికలకు నిర్వహించే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్ అథ్లెటిక్స్ క్రీడలను బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే విద్యార్థుల ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 15 మండలాల నుంచి క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలవాలని సూచించారు.

News October 15, 2025

వనపర్తి: రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు: మంత్రి

image

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కలెక్టర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటుకు జిల్లాల వారీగా కలెక్టర్లు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.