News February 14, 2025

సంగారెడ్డి: కోటి రుద్రాక్ష మహోత్సవానికి కేంద్ర మంత్రికి ఆహ్వానం

image

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 26న సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో జరిగే కోటి రుద్రాక్ష మహోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీమహేశ్వర శర్మ సిద్ధాంతి శుక్రవారం ఆహ్వాన పత్రిక అందజేశారు.1.08 కోట్ల రుద్రాక్షలతో 18.5 అడుగుల శివలింగాన్ని తయారు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News December 8, 2025

అనంతపురంలో వాహనదారులపై పడ్డ TDP ఫ్లెక్సీలు

image

అనంతపురంలో TDP ఫ్లెక్సీలు కిందపడి ఇద్దరికి గాయాలైన ఘటన సోమవారం జరిగింది. అనంతపురం తపోవనం బ్రిడ్జిపై నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారని పలువురు ఆరోపించారు. కాగా నేడు ఫ్లెక్సీలు ఉన్న మార్గంలో పలువురు వెళ్తుండగా ఫ్లెక్సీలు పైన పడడంతో బైక్‌పై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా జనాలపై ఎందుకు మీకు ఇంత కక్ష అంటూ YCP తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలు పోస్ట్ చేసింది.

News December 8, 2025

NTR: 10 నుంచి ఏపీ టెట్-2025 పరీక్షలు

image

ఏపీ టెట్-2025 పరీక్షలు ఈ నెల 10 నుంచి 21 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో జరుగుతాయని DEO సుబ్బారావు తెలిపారు. విజయవాడ, మైలవరం, తిరువూరులో 7, అలాగే ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెంలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హాల్‌ టికెట్‌, ఫొటో గుర్తింపుతో రావాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని చెప్పారు.

News December 8, 2025

ఎన్టీఆర్ జిల్లాలో ఊపందుకున్న క్యాటిల్స్ షెడ్ల నిర్మాణం

image

ఎన్టీఆర్ జిల్లాలో పశువులు, మేకలు, గొర్రెల షెడ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. 13 మండలాల పరిధిలోని 239 పంచాయతీల్లో 831 పనులకు మంజూరు కాగా, ప్రస్తుతం 565 షెడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 189 షెడ్లు పూర్తయ్యాయి. పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ మండలాల్లో పనుల పురోగతి మెరుగ్గా ఉంది. సకాలంలో నిధులు మంజూరు చేసి, లక్ష్యం అధిగమించాల్సి ఉంది.