News February 1, 2025

సంగారెడ్డి: గంజాయి అమ్మి జైలు పాలయ్యాడు

image

గంజాయి అమ్మిన వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ జడ్జి జయంతి శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2009 సంవత్సరంలో సంగారెడ్డిలో 5 కిలోల గంజాయి విక్రయిస్తూ మహమ్మద్ సెమీ అన్సారి అలియాస్ బిలాల్‌ను అప్పటి ఎక్సైజ్ సీఐ మధుబాబు పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. జైలు శిక్ష పడేలా చార్జిషీట్ దాఖలు చేసిన మధుబాబును అభినందించారు.

Similar News

News February 1, 2025

2047కల్లా 100 GW అణు విద్యుత్ లక్ష్యం: నిర్మల

image

2047కల్లా కనీసం 100 గిగావాట్ల అణువిద్యుత్‌ను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ‘చిన్న చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు రూ.20వేలకోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌ పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ రంగంతో క్రియాశీల భాగస్వామ్యం కోసం అణుశక్తి చట్టానికి, అణుశక్తి పౌర బాధ్యత చట్టానికి సవరణలు చేస్తాం’ అని స్పష్టం చేశారు.

News February 1, 2025

BUDGET: స్కూల్ స్టూడెంట్స్ కోసం ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’

image

ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ మిషన్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 50వేల పాఠశాలల్లో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ నెలకొల్పుతామని ప్రకటించారు. ఇవి స్టూడెంట్స్‌లో ఆసక్తి, సృజన, సైంటిఫిక్ టెంపర్‌మెంట్ పెంచుతాయని తెలిపారు. డిజిటల్ లెర్నింగ్ వనరుల యాక్సెస్ కోసం అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

News February 1, 2025

BIG NEWS: కొత్త ఆదాయ పన్ను చట్టం

image

ఆదాయపన్ను చెల్లింపు దారులకు ఊరట లభించబోతున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈసారి ట్యాక్స్ సహా ఆరు సంస్కరణలు చేపట్టబోతున్నట్లు చెప్పిన మంత్రి దీన్ని ఉటంకిస్తూ ప్రకటన చేశారు. మార్పులతో కూడిన ఐటీ బిల్లును వచ్చే వారం లోక్‌సభలో ప్రవేశపెడతామన్నారు.