News February 1, 2025
సంగారెడ్డి: గంజాయి అమ్మి జైలు పాలయ్యాడు

గంజాయి అమ్మిన వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ జడ్జి జయంతి శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2009 సంవత్సరంలో సంగారెడ్డిలో 5 కిలోల గంజాయి విక్రయిస్తూ మహమ్మద్ సెమీ అన్సారి అలియాస్ బిలాల్ను అప్పటి ఎక్సైజ్ సీఐ మధుబాబు పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. జైలు శిక్ష పడేలా చార్జిషీట్ దాఖలు చేసిన మధుబాబును అభినందించారు.
Similar News
News October 18, 2025
కామారెడ్డి: ఆశావహులతో AICC అబ్జర్వర్ సమావేశం

కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న 28 మంది అభ్యర్థులతో R&B గెస్ట్ హౌస్లో AICC అబ్జర్వర్ రాజ్ పాల్ శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన ప్రతి అభ్యర్థితో విడివిడిగా మాట్లాడారు. వారి అనుభవం, పార్టీ బలోపేతానికి చేయగలిగే కృషిపై అభిప్రాయాలు సేకరించారు. తుది నివేదికను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, AICCకి సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News October 18, 2025
VJA: శవాల దగ్గర బేరాలు.. ఇష్ట రాజ్యాంగ డబ్బులు వసూలు.!

కొత్త ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రైవేట్ అంబులెన్స్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. జిల్లా దాటి మృతదేహాలను తరలించేందుకు, రాజేశ్ అనే వ్యక్తికి చెందిన అంబులెన్సుల ఏజెంట్ నజీర్ చెప్పిందే రేటు. మహాప్రస్థానం వాహనాలు కృష్ణా జిల్లా వరకే ఉండటంతో, గుంటూరుకు ₹4వేలు, ఏలూరుకు ₹5,500 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దుఃఖంలో ఉన్న బాధితుల నుంచి అధిక డబ్బులు పుచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం అవుతోంది.
News October 18, 2025
ఎలమంచిలి: ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానంపై సమావేశం

ఎలమంచిలి ఎంపీపీ బి. గోవిందుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గత నెల 24న నలుగురు సభ్యులు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఆర్డీవో షేక్ ఆయిషా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సమావేశానికి నోటీసు ఇచ్చిన జనసేన ఎంపీటీసీలు బి. శివలక్ష్మి, నగిరెడ్డి అమ్మాజీ, రాజన శేషు, ఎస్. ఉమా హాజరయ్యారు. కొద్దిసేపట్లో ఈ విషయం తేలనుంది.