News May 25, 2024

సంగారెడ్డి: గొర్రెల యూనిట్ల డబ్బులు వాపస్!

image

గొర్రెల యూనిట్ల పంపిణి పథకాన్ని ప్రభుత్వం పక్కన పెట్టినట్లుంది. సంగారెడ్డి జిల్లాలో గతంలో గొర్రెల యూనిట్ల కోసం గొర్రెల కాపరులు తమ వాటాగా చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించాలని అన్నారు. ఇప్పటి వరకు 1,195 మంది లబ్ధిదారులకు మాత్రమే వాటా డబ్బులు వాపస్‌ ఇవ్వాలని అనుకున్నారు. వీరిలో ఒకరికి వాటా డబ్బులను తిరిగి ఇచ్చేశారు. మరో 257 మందికి డబ్బులు వాపస్‌ తిరిగి ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.

Similar News

News February 11, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

image

పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు.మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మెదక్, నిజామాబాద్ అదిలాబాద్ , కరీంనగర్ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన పిఓలు, ఏపిఓలు, సెక్టార్, నోడల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

News February 11, 2025

మెదక్: శవం వద్ద మెడికల్ విద్యార్థుల ప్రమాణం

image

మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్‌కి ముందు వారికి విజ్ఞానాన్ని పంచే శవం వద్ద ప్రమాణం చేశారు. ఎల్లప్పుడు గౌరవాన్ని, విఘ్నతను కలిగి ఉంటామని కృతజ్ఞులమై ఉంటామని వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రకుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిశంకర్, డాక్టర్ జయ, అనాటమీ విభాగం డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.

News February 11, 2025

మెదక్ జిల్లాలో రూ.84,40,52,317 జమ

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. గత రెండు రోజుల కింద ఎకరంలోపు సాగు చేసుకునే రైతులకు వారి అకౌంట్లో జమ చేసింది. సోమవారం రెండు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులకు విడుదల చేయగా మెదక్ జిల్లాలోని మొత్తం 1,72,349 మంది రైతులకు రూ.84,40,52,317 జమ చేశారు. దీని పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!