News March 12, 2025

సంగారెడ్డి: గ్రూప్-2లో జిల్లా వాసికి 3వ ర్యాంక్

image

టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ మనోహర్ రావుకు రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. మొత్తం 600 మార్కులకు 439.344 మార్కులు సాధించాడు. గ్రూప్-1లో కూడా 430 మార్కులు సాధించాడు. 2020లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి 317 జీఓలో మెదక్ జిల్లాకు వచ్చాడు. స్వగ్రామం సంగారెడ్డి జిల్లా ఉజలంపాడు.

Similar News

News December 3, 2025

పశ్చిమలో ‘కొబ్బరి’కి కొత్త కళ..

image

ప.గో జిల్లాలోని కొబ్బరి రైతులు, అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. కొబ్బరి క్లస్టర్‌ పరిధిలో రూ.29.97 కోట్ల అంచనాతో చేపట్టనున్న అత్యాధునిక ‘కామన్ ఫెసిలిటీ సెంటర్’ పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వాటా రూ.4.49 కోట్లలో.. తొలివిడతగా రూ.2.24 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కేంద్రం ద్వారా కొబ్బరి, బంగారం ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలు సాధించేందుకు మార్గం సుగమమైంది.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు చార్టెడ్ ఫ్లైట్లలో ప్రముఖులు

image

గ్లోబల్ సమ్మిట్‌కు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం ఏకంగా 3 హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. 50 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ హెలిప్యాడ్‌ల ద్వారా సుమారు 500 మంది ప్రముఖ అతిథులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఈవోలు, సినీ తారలు సహా పలువురు ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్లలో ఇక్కడికి చేరుకుంటారని అధికారులు Way2Newsకు తెలిపారు.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు చార్టెడ్ ఫ్లైట్లలో ప్రముఖులు

image

గ్లోబల్ సమ్మిట్‌కు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం ఏకంగా 3 హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. 50 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ హెలిప్యాడ్‌ల ద్వారా సుమారు 500 మంది ప్రముఖ అతిథులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఈవోలు, సినీ తారలు సహా పలువురు ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్లలో ఇక్కడికి చేరుకుంటారని అధికారులు Way2Newsకు తెలిపారు.