News March 8, 2025
సంగారెడ్డి: చదువుతోనే మహిళకు సాధికారత: కలెక్టర్

మహిళా సాధికారతకు చదువే ప్రధాన ఆధారమని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మాయి చదువు కుటుంబానికి వెలుగుని ఇస్తుందని చెప్పారు. మహిళల సమానత్వం ఇంటి నుంచి ప్రారంభం కావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
అల్లూరి: ‘మండలాల వారీగా సమగ్ర సమాచారం తయారు చేయాలి’

జిల్లాలో ఖనిజాల లభ్యతపై మండలాల వారీగా సమగ్ర సమాచారం తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీసీ నిర్వహించారు. క్వారీల నిర్వహణలో, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అక్కడ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. డుంబ్రిగుడ మండలం అరకుసంతబయలులో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మించనున్నామన్నారు. దీంతో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
News November 4, 2025
అనకాపల్లి: ‘స్నాన ఘట్టాల వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలి’

కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలో ఈనెల 5న శైవ క్షేత్రాల వద్ద గల స్నాన ఘట్టాలలో భద్రత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనకాపల్లి కలెక్టరేట్ నుంచి పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాల వద్ద క్యూలైన్లు, బారికెడ్లు నిర్మించాలన్నారు.
News November 4, 2025
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి: కలెక్టర్

కాళేశ్వరం అభివృద్ధి పనులలో పురోగతి, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం అభివృద్ధి పనుల వేగాన్ని పెంచాలని, నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని సూచించారు. పెండింగ్ పనులను సమయానికి పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.


