News June 2, 2024
సంగారెడ్డి: చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గుర్రపు శ్రీనివాస్ కుమారుడు బద్రీనాథ్(17) హైదరాబాద్లో ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్షలు రాశాడు. వారం కిందట అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతోపాటు గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News September 19, 2025
పాపన్నపేట: ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన: కలెక్టర్

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పాపన్నపేట పీహెచ్సీలో నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పరిశీలించి, వైద్య సౌకర్యాలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబమే దేశ సంక్షేమని అన్నారు.
News September 18, 2025
MDK: మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

మెదక్లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 18, 19న దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాదేవి తెలిపారు. కళాశాలలో బీఎస్సీ, బీఏ గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్టీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 7901097706ను సంప్రదించాలని సూచించారు.
News September 18, 2025
మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు జేఎంజే విద్యార్థులు

మెదక్ జిల్లా మనోహరాబాద్ జేఎంజే విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ మహేశ్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.